సోషల్ మీడియాలో ఎవరూ దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్ట వద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దన్నారు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు.