మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు నిండుకుండని తలపిస్తున్నాయి. ఐనా పాపవినాశనం, ఆకాశగంగ, పసుపుధార, కుమారధార, గోగర్భం డ్యాంలు పూర్తిగా జలకళను సంతరించుకున్నాయి. పాపవినాశనం డ్యాం పూర్తిగా నిండిపోయింది. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తుంది.