సంగారెడ్డి జిల్లాలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. పటాన్చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ చౌదరి ఇవాళ మృతి చెందాడు. ఇంకా తొమ్మిది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఘటన స్థలంలో దొరికిన ఎముకలను డీఎన్ఏ పరీక్షల కోసం ల్యాబ్కి పంపారు.