నేషనల్ హెరాల్డ్ కేసుపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించింది. కానీ నిందితుల జాబితాలో చేర్చలేదు. వైఐ, ఏజీఎల్కు విరాళాలు అందించడానికి కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించారని.. వారిలో రేవంత్ కూడా ఉన్నారని ఈడీ స్పష్టం చేసింది.