ఏపీ బీజేపీకి కొత్త సారథిని ఎంపిక చేయడానికి కసరత్తు జరుగుతోంది. మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని పురందేశ్వరి కోరుతున్నారు. కానీ.. తమకు అవకాశం ఇవ్వాలని మరో ముగ్గురు నేతలు లైన్లో ఉన్నారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయో అని చర్చ జరుగుతోంది.