ప్రణయ్ హత్య కేసులో తీర్పు రాకముందే ప్రధాన సూత్రధారి.. ఏ1 మారుతీరావు సూసైడ్ చేసుకున్నారు. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించిన నల్గొండ ఎస్సీ, ఎస్సీ కోర్టు.. హంతకుడు ఏ2 సుభాష్శర్మకు ఉరి శిక్ష విధించింది. దీంతో అసలు సుభాష్శర్మకు ఈ కేసుతో సంబంధం ఏంటి.. అతను ప్రణయ్ను ఎందుకు చంపాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది.
ఉరి శిక్ష పడిన సుభాష్శర్మది బీహార్ రాష్ట్రం సమస్థిపూర్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం. అతని కుటుంబం చిన్న గూడెంలో నివసించేది. ఈ హత్య జరిగిన తర్వాత సుభాష్శర్మ అతని సొంతూరుకు వెళ్లారు. ఈ కేసు దర్యాప్తును అప్పటి ఐజీ స్టీఫెన్ రవీంద్ర, నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్.. నల్గొండ టూ టౌన్ అప్పటి సీఐ బాషా, మెదక్ ఎస్సై శివకుమార్కు అప్పగించారు. బాషాకు అప్పటికే ఎన్ఐఏలో పని చేసిన అనుభవం ఉంది.
అనుభవం ఉన్న బాషాను రంగనాథ్ బీహార్కు పంపారు. ఆయన అక్కడికి వెళ్లి సమస్థీపూర్ పోలీసులకు విషయం చెప్పారు. కానీ.. వారు సహకరించలేదు. దీంతో ఎన్ఐఏలో పనిచేసినప్పుడు పరిచయం అయిన ఓ ఎస్పీ స్థాయి అధికారికి బాషా కేసు గురించి చెప్పారు. ఆయన ద్వారా స్థానిక పోలీసుల సహకారం తీసుకొని.. సుభాష్శర్మ సొంతూరుకు వెళ్లారు. అక్కడికి వెళ్లడానికి చాలా కష్టపడ్డారు.
అటవీ ప్రాంతంలోని గూడెంలో సుభాష్శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సుభాష్శర్మ సోదరుడు, వందమంది వరకు పోలీసుల వాహనాలను వెంబడించారు. దాడికి ప్రయత్నించారు. కానీ.. వారినుంచి తప్పించుకొని బాషా.. సుభాష్శర్మను పాట్నా తీసుకొచ్చారు. అక్కడినుంచి హైదరాబాద్కు, ఆ తర్వాత నల్గొండకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు వేగంగా జరిగింది.
ఈ కేసులో ఓ నిందితుడు ఆస్గర్ అలీ ద్వారా సుభాష్శర్మ సీన్లోని ఎంట్రీ ఇచ్చాడు. ప్రణయ్ను చంపితే రూ.2 లక్షలు ఇస్తానని అస్గర్ అలీ.. సుభాష్శర్మకు సుపారీ ఇస్తాడు. అందుకు రూ.20 వేలు అడ్వాన్స్ ఇస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మారుతీరావు, ఇతరులు జైల్లో ఉన్నారు. సుభాష్శర్మకు మిగతా డబ్బులు ఇవ్వలేదు. దీంతో కోర్టు వాయిదాకు వచ్చిన సమయంలో శ్రవణ్ అనే వ్యక్తిని సుభాష్శర్మ డబ్బులు అడిగాడు. ఆ సమయంలో జడ్జి ఎదుటే శ్రవణ్పై సుభాష్శర్మ చేసినట్టు తెలిసింది.
అస్గర్ అలీకి సుభాష్శర్మ రాజమండ్రి సెంట్రల్ జైలులో పరిచయం అవుతాడు. అంతకుముందు ప్రణయ్ను చంపడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. మారుతీరాలు కరీం, అస్గర్ అలీలను కొప్పడతాడు. దీంతో అస్గర్ సుభాష్శర్మకు ఫోన్ చేసి మిర్యాలగూడకు రప్పిస్తాడు. దాదాపు నెల రోజుల పాటు సుభాష్శర్మ రెక్కీ నిర్వహిస్తాడు. తొలుత ప్రణయ్ని కిడ్నాప్ చేసి చంపాలని ప్లాన్ చేస్తారు. అందుకోసం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి కొందరని రప్పిస్తారు. కానీ.. ఆ ప్రయత్నం కూడా విఫలం అవ్వడంతో.. ఆఖరికి ఆసుపత్రి వద్ద కత్తితో దాడి చేసి చంపేస్తారు.