తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టం అమలును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీన పోర్టల్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫలితంగా రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రాగా… త్వరలోనే అన్ని మండలాల్లోనూ ప్రారంభిస్తారు.
గతంలో ధరణి పోర్టల్ లో ఉన్న ఇబ్బందులకు అవకాశం ఇవ్వకుండా….రైతుకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా భూ భారతి పోర్టల్ ను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. అత్యంత సరళమైన భాషతో పాటు తక్కువ మాడ్యూల్స్ తో సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేస్తోంది.
భూ- భారతి చట్టం ప్రకారం….. ప్రతి భూకమతానికి భూ ఆధార్ రానుంది. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. ధరణిలో అప్పీల్ వ్యవస్థకు అవకాశం లేకపోగా…. భూ భారతిలో మాత్రం అవకాశం కల్పించారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండెంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుంది.
మొదటగా ఎమ్మార్వోలు ఇచ్చే పట్టా పాసు పుస్తకాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆర్డీవో కు వెళ్లొచ్చు. ఇక్కడ కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా…. కలెక్టర్ ఇచ్చే తీర్పుపై అభ్యంతరాలుంటే భూ ట్రైబ్యునల్ను ఆశ్రయించే వీలు ఉంటుంది. ఈ అప్పీళ్ల వ్యవస్థ ద్వారా… నేరుగా కోర్టుకు వెళ్లే పని ఉండదు. ధరణి ఉన్నప్పుడు అప్పీళ్ల వ్యవస్థ లేకపోవటంతో…. చాలా మంది కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది.
భూ భారతి పోర్టల్ ద్వారా పలు సేవలు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు ప్రజలు పొందవచ్చు. అయితే ఇందులో కొన్నింటికి ప్రభుత్వం ఫీజులను నిర్దేశించింది. వాటి వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి….
సంబంధిత కథనం