TS Weekend Politics : వీకెండ్ పాలిటిక్స్.. సండే వస్తేనే నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలట
Telangana Politics : ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ కష్టం వచ్చినా.. వినేందుకు దగ్గరలో ఉండాలి. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారట. అదేనండి వారం మెుత్తం హైదరాబాద్ లో ఉండి.. శనివారంనాడు నియోజకవర్గానికి వెళ్తున్నారట.
చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాద్(Hyderabad)లోనే ఎక్కువ సమయం గడపడం, తమ నియోజకవర్గాలకు అందుబాటులో ఉండకపోవడంపై కేసీఆర్(KCR) సీరియస్గా తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిగిలిన 14 నెలల పాటు తమ నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఆదేశాలు వెళ్తున్నాయట. అయితే ఇది ఒక్క పార్టీ అనే కాదు.. మిగిలిన పార్టీల్లోని ఎమ్మెల్యేలూ అలానే ఉన్నారని విమర్శలు ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
2023 అసెంబ్లీ ఎన్నికల(2023 Assembly Elections)కు ఏడాది మాత్రమే సమయం ఉండగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(TRS MLAs) హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తున్నారని, వారి నియోజకవర్గాలకు వెళ్లలేదని సర్వేలు వచ్చాయట. ప్రజల ఆగ్రహానికి ఇది కూడా ఓ కారణమైనట్లు సీఎం కేసీఆర్(CM KCR) సర్వేల్లో తేలిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమించుకున్నారని, వీరిలో ఎక్కువగా కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, ఎమ్మెల్యే(MLA)ల తరపున బాధ్యతలు నిర్వహించే స్నేహితులు ఉన్నారని తేలింది. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి ఎమ్మెల్యేల వద్దకు పంపి పరిష్కారం చూపుతున్నారు. అయితే, ఇది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు 'ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అధికారులు'గా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే అభిప్రాయాన్ని ప్రజలకు కలుగుతుంది.
మెజారిటీ ఎమ్మెల్యేలు వారం రోజులు హైదరాబాద్(Hyderabad)లో గడుపుతున్నారని, వారాంతాల్లో నియోజకవర్గాల పర్యటనకు వెళతారని తేలింది. ప్రారంభోత్సవాలు లేదా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు వంటి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవలసి వస్తే తప్ప, కొద్దిమంది మంత్రులు ప్రతి రెండు వారాలకు ఒకసారి నియోజకవర్గాలను సందర్శిస్తారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఎక్కువ సమయం గడపడం, తమ నియోజకవర్గాలను కుటుంబసభ్యులు, ఇతరులకు వదిలేయడంపై టీఆర్ఎస్(TRS) అధిష్ఠానం కూడా సీరియస్ గా ఉందట. వివిధ శాఖలపై సమీక్షా సమావేశాలు లేదా క్యాబినెట్ సమావేశాలు(Cabienet Meetings) తరచుగా జరగడం లేదు కాబట్టి మంత్రులకు హైదరాబాద్లో ఏం పని అని జనాలు ప్రశ్నిస్తున్నారు. మా దగ్గరకు వచ్చి సమస్యలు వినొచ్చు కదా అంటున్నారు.
పాత సచివాలయాన్ని(Sachivalayam) కూల్చివేసి కొత్త సమీకృత సచివాలయ సముదాయాన్ని నిర్మాణం కారణంగా 2019 ఆగస్టు నుండి తెలంగాణ(Telangana)కు శాశ్వత సచివాలయం లేకుండా పోయింది. నగరంలోని ఇతర చోట్ల తాత్కాలిక వసతి నుండి పని చేస్తున్నాయి. నియోజకవర్గాలకు వెళ్లి ప్రజా సమస్యలను వింటే మంచిదని టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం కూడా అంటోంది. 2023 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఇక నియోజకవర్గాలకే పరిమితం కావాలని ఆదేశాలు వెళ్లే అవకాశం ఉంది.