Karimnagar Mystery Deaths Case: విష ప్రయోగం జరిగిందా..? భర్తనే కారకుడా.. ?-twist in four members of a family died in karimnagar district case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Twist In Four Members Of A Family Died In Karimnagar District Case

Karimnagar Mystery Deaths Case: విష ప్రయోగం జరిగిందా..? భర్తనే కారకుడా.. ?

HT Telugu Desk HT Telugu
Jan 01, 2023 11:50 AM IST

Four members of a family died in karimnagar: అంతుచిక్కని వ్యాధి... ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో అసలు నిజాలు బయటికి వస్తున్నాయి. విష ప్రయోగం జరిగటంతోనే వీరంతా చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా భర్తనే చేశాడనేది సమాచారం.

వారిపై విష ప్రయోగం జరిగిందా..?
వారిపై విష ప్రయోగం జరిగిందా..?

Karimnagar Crime News: 45 రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం..కరీంనగర్‌ జిల్లా గంగాధరలో సంచలనంగా మారింది. ఇందులో ఇద్దరు పిల్లలతో పాటు భార్య భర్త కూడా ఉన్నారు. అసలేం జరిగిందో కూడా అర్థంకాని పరిస్థితి. సీన్ కట్ చేస్తే రంగంలోకి దిగిన పోలీసులు... అసలు వాస్తవాలను బయటికి తీసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రక్త నమూనాలను ల్యాబ్ కు పంపగా... కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విష ప్రయోగంతోనే వీరంతా చనిపోయినట్లు తెలుస్తోంది. దీనంతటికీ భర్తనే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగిందంటే..?

గంగాధరకు చెందిన శ్రీకాంత్‌కు చొప్పదండికి చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి కూతురు అమూల్య (6), కుమారుడు అద్వైత్ (2) జన్మించారు. మొదట కుమారుడికి వాంతులు మొదలయ్యాయి. దానితో పాాటు వీరేచనాల సమస్య వేధించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ బాధ నుంచి కోలుకోముందే... కుమార్తె అమూల్యం కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్‌9న ప్రాణాలు విడిచింది.సీన్ కట్ చేస్తే మమత కూడా అస్వస్థతకు గురైంది. చికిత్స పొందుతూ మమత కూడా ఆదివారం తుదిశ్వాస విడిచింది. శనివారం భర్త శ్రీకాంత్ కూడా రక్తం కక్కి చనిపోయాడు. ఈ మరణాలు కాస్త... సంచలనంగా మారాయి. అంతుచిక్కని రోగానికి బలి అయిపోయారనే వార్తలు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు... విచారణ వేగవంతం చేశారు. రక్త నమూనాలను ల్యాబ్ కు పంపటంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విష ప్రయోగం జరగటం వల్లే వారంతా చనిపోయిట్లు రిపోర్టులో తేలినట్లు సమాచారం. అయితే ఇదంతా కూడా భర్త శ్రీకాంతే చేసినట్లు తెలుస్తోంది. దీని వెనక ఉన్న పలు కారణాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

భర్త అయిన వేముల శ్రీకాంత్ ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఒక్కొక్కరికి విషం ఇచ్చి శ్రీకాంతే చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రక్త నమూనాలను ల్యాబ్ పంపిన మరునాడే శ్రీకాంత్.. కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అసలు విషయం బయటికి వస్తుందన్న భయంతోనే శ్రీకాంత్ సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. శ్రీకాంత్ కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ కోణంలోనే కుటుంబాన్ని చంపేసి...ఆమెతో ఉండేందుకు ఇలా చేశాడా..? లేదా ఇతర కారణాలు ఉన్నాయా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కేసుపై పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం