Hyd Suicides: హైదరాబాద్‌‌లో విషాదం.. ఆర్నెల్లుగా ఉద్యోగం లేక పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు-tragedy in hyderabad couple were unemployed for months and killed their children and committed suicide ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Suicides: హైదరాబాద్‌‌లో విషాదం.. ఆర్నెల్లుగా ఉద్యోగం లేక పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు

Hyd Suicides: హైదరాబాద్‌‌లో విషాదం.. ఆర్నెల్లుగా ఉద్యోగం లేక పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు

Sarath Chandra.B HT Telugu

Hyd Suicides: హైదరాబాద్‌ హబ్సిగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులు, ఆర్నెల్లుగా ఉద్యోగం లేకపోవడంతో పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్‌నగర్‌ కల్వకుర్తికి చెందిన ప్రైవేట్‌ లెక్చరర్‌ చంద్రశేఖర్‌ రెడ్డితో పాటు భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్‌లో విషాదం, ఆర్థిక ఇబ్బందులతో పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య (istockphoto)

Hyd Suicides: హైదరాబాద్‌లో ఆర్ధిక ఇబ్బందులతో ఓ కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రైవేట్‌ కరాలేజీలో లెక్చరర్‌గా పనిచేసే చంద్రశేఖర్‌ రెడ్డి తన ఇద్దరు పిల్లల్ని చంపి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కొన్ని నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కుంగిపోయిన చంద్రశేఖర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకోడానికి భార్యను ఒప్పించి పిల్లలకు విషం ఇచ్చి చంపేసి భార్యతో కలిసి ప్రాణాలు విడిచాడు.

మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన కె.చంద్రశేఖర్రెడ్డి హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. భార్య కవిత(35), పిల్లలు శ్రీతా(15), విశ్వంత్(10)లతో కలిసి హబ్సిగూడలోని మహేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్నారు. కవిత గృహిణి కాగా కుమార్తె శ్రీతా తొమ్మిదో తరగతి, కుమారుడు విశ్వంత్ ఐదో తరగతి చదువుతున్నారు. ఏడాాదిగా హబ్సిగూడలో నివాసం ఉంటున్నారు. మరో దారి లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖ రాసి పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

చంద్రశేఖర్‌ రెడ్డి కొంతకాలం ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఆర్నెల్ల క్రితం మానేశారు. ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో వీరి కుటుంబంఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సోమవారం కుమారుడు విశ్వాన్‌రెడ్డికి విషం ఇచ్చి, కుమార్తె శ్రీతరెడ్డి ఉరేసి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత భార్య కవితతో కలిసి చంద్రశేఖర్రెడ్డి ఉరి వేసుకున్నారు. ఓయూ పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చావుకు ఎవరు కారణం కాదు…

చంద్రశేఖర్‌ రెడ్డి సూసైడ్‌ నోట్‌లో తన చావుకి ఎవరు కారణం కాదని పేర్కొన్నారు. వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాశారు. ఆత్మహత్య చేసుకున్నందుకు క్షమించాలని, కెరీర్‌లో, శారీరకంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వివరించారు. మధుమేహం, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు సూసైడ్ నోట్‌లో వివరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఓయూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం