BRS vs Congress : ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ 15 ప్రశ్నలు.. సమాధానం చెప్పాలని టీపీసీసీ డిమాండ్-tpcc chief mahesh kumar goud poses 15 questions to mlc kavitha ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Vs Congress : ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ 15 ప్రశ్నలు.. సమాధానం చెప్పాలని టీపీసీసీ డిమాండ్

BRS vs Congress : ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ 15 ప్రశ్నలు.. సమాధానం చెప్పాలని టీపీసీసీ డిమాండ్

Basani Shiva Kumar HT Telugu
Jan 02, 2025 07:22 PM IST

BRS vs Congress : అధికారం పోయిన తర్వాత బీసీలపై బీఆర్ఎస్ కపట ప్రేమ చూపిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కల్వకుంట్ల కుటుంబం బీసీలపై మొసలికన్నీరు కారుస్తోందని ఫైర్ అయ్యింది. బీసీలకు కాంగ్రెస్ మాత్రమే మేలు చేస్తోందని.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

మహేశ్‌కుమార్ గౌడ్
మహేశ్‌కుమార్ గౌడ్

స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి.. వారి గొంతు కోసింది బీఆర్ఎస్ పార్టీనే అని.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత.. దాన్ని పోగొట్టుకునేందుకు బీసీల పేరిట కపట నాటకం మొదలుపెట్టారని విమర్శించారు. అందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారని వ్యాఖ్యానించారు. బీసీలు ఈ కుట్రలను గమనించి.. బీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

yearly horoscope entry point

కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందని మహేశ్ వివరించారు. అందుకు నిదర్శనం తనను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమే అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధ్యక్షులుగా బీసీ నేతను నియమించడం సాధ్యపడుతుందా అని ప్రశ్నించారు. బీసీల పేరుతో ధర్నా చేయాలని నిర్ణయించిన మీకు.. టీపీసీసీ అధ్యక్షులుగా కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నానని.. వీటికి సరైన సమాధానం చెబుతారని ఆశిస్తున్నానని మహేశ్ స్పష్టం చేశారు.

15 ప్రశ్నలు..

1) కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 23 శాతం నుండి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా?

2) బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా.. పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా?

3) స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా?

4) స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి.. ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా?

5) జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు.. రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా?

6) బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీ సంక్షేమ బడ్జెట్‌ను రూ.2971.32 కోట్లకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా?

7) కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి.. తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా?

8) గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా?

9) బీసీ సామాజికవర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా?

10) ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా?

11) మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో.. 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా?

12) బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం రూ.100 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా?

13) గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా?

14) 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్స్ నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా?

15) బీసీ కార్పొరేషన్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.73 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా? అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

Whats_app_banner