Telangana News Live January 28, 2025: Chandrababu Cases : సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట, కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 28 Jan 202503:59 PM IST
Chandrababu Cases : ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల విచారణను సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. పిటిషనర్ పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tue, 28 Jan 202503:33 PM IST
Andole Tank Bund : ఆందోల్ పట్టణ సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఆందోల్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ లో బోటింగ్, రెస్టారెంట్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై అధికారులతో మంత్రి చర్చించారు.
Tue, 28 Jan 202502:42 PM IST
Meerpet Murder Case : మీర్ పేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. పూర్తి ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేశారు. భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని మాయం చేశాడు నిందితుడు గురుమూర్తి. భార్యను హత్య చేసిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపంలేదని సీపీ సుధీర్ బాబు అన్నారు.
Tue, 28 Jan 202511:48 AM IST
- Meerpet Murder Case : సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. నిందితుడు గురుమార్తిని తన ఇంటికి తీసుకొచ్చారు. హత్య చేసిన విధానాన్ని తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు గురుమూర్తిని రిమాండ్కు తరలించే ఛాన్స్ ఉంది.
Tue, 28 Jan 202510:52 AM IST
- Investments in Telangana : తెలంగాణకు పెట్టుబడుల అంశంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. రేవంత్ దావోస్ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. పెట్టుబడులు పెట్టే సంస్థలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.
Tue, 28 Jan 202509:41 AM IST
- Vikarabad : వికారాబాద్ సమీపంలో ఎక్స్పీరియం పార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు.
Tue, 28 Jan 202508:32 AM IST
- KTR Thanks to CBN : బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పురోగతిని గుర్తించినందుకు.. ఏపీ సీఎం చంద్రబాబుకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. ఆయనకు అవగాహన కల్పించాలని కోరారు.
Tue, 28 Jan 202507:24 AM IST
- Nagoba Jatara: ఇంద్రవెల్లి ఆదివాసుల ఆరాధ్యదైవం రాష్ట్ర పండుగైన కేస్లాపూర్ జాతరకు వెళయింది. పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి నుంచి వంశీయులు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నాగోబా మహా పూజకు మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు. ఈ జాతర నేటి నుండి ఫిబ్రవరి 2 వరకు అధికారికంగా సాగనుంది.
Tue, 28 Jan 202506:52 AM IST
- TG Fake Currency : తెలంగాణలో దొంగనోట్ల దందా రోజురోజుకూ పెరుగుతోంది. దేవుడి హుండీలు మొదలు.. కిరాణా షాపుల వరకు ఎక్కడ చూసినా దొంగనోట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో సామాన్యులు మోసపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఈ దందా ఆగడం లేదు. దీనికి కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.
Tue, 28 Jan 202505:09 AM IST
- Meerpet Murder Case : మీర్పేట మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా పోలీసుల విచారణలో మరో విషయం వెల్లడైంది. నిందితుడి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. హత్యకు ముందు. తర్వాత ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకుంటున్నారు.
Tue, 28 Jan 202504:07 AM IST
- Nagoba Jatara 2025 : నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ (మంగళవారం) రాత్రి నాగోబాకు మహాపూజ చేయనున్నారు మెస్రం వంశీయులు. ఫిబ్రవరి 4 వరకు కేస్లాపూర్లో నాగోబా జాతర జరగనుంది. ఈ జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశారు.
Tue, 28 Jan 202503:50 AM IST
- Kamareddy Crime: అక్రమ సబందం మరొక ప్రాణం బలి తీసుకుంది. భర్త ఉండగానే మరొక యువకుని తో సంబంధం పెట్టుకున్న, ఒక వివాహిత తన ప్రియునితో కలిసి భర్తను బండరాళ్లతో మోదీ చంపినా సంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది. కామారెడ్డి జిల్లాలోని బిక్నురు మండలంలోని మళ్లుపల్లిలో ఈ ఘటన జరిగింది.
Tue, 28 Jan 202503:20 AM IST
- TG Intermediate Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మరో నెలన్నరలో జరుగనుండగా పరీక్ష ప్రశ్నా పత్రాల్లో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదించడంపై విద్యార్థులతో పాటు విద్యా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Tue, 28 Jan 202502:45 AM IST
- HYD Accident: హైదరాబాద్ ఆరాంఘర్ కొత్త ఫ్లైఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లు మృతి చెందారు. బైక్పై మితిమీరిన వేగంతో స్టంట్లు చేస్తుండగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో బహదూర్పురాకు చెందిన ముగ్గురు మృతి చెందారు.
Tue, 28 Jan 202501:16 AM IST
- Amazon Employees: అమెజాన్ కంపెనీ సరకు రవాణాలో వేయని ట్రిప్పులకు చెల్లింపులు జరిపి ఏకంగా రూ.102కోట్లు కొట్టేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సరకు రవాణా పర్యవేక్షణ హైదరాబాద్ నుంచి జరుగుతుండటంతో కుట్ర పూరితంగా మోసం చేశారు.
Tue, 28 Jan 202512:22 AM IST
- Singur Tourism: సింగూర్ ప్రాజెక్ట్ లో ఉన్న ద్వీపాన్ని అభివృద్ధి చేసి, అక్కడికి 50 సీట్ల కెపాసిటీ ఉన్న రెండు బోట్లు నడిపేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ద్వీపం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు.