Telangana News Live January 27, 2025: High Court On Theatres : 16 ఏళ్లలోపు పిల్లలకు ఆ సమయాల్లో థియేటర్లలోకి నో ఎంట్రీ, హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 27 Jan 202505:17 PM IST
High Court On Theatres : 16 ఏళ్ల లోపు పిల్లలు థియేటర్లకు వెళ్లే సమయాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యల చేశారు. పిల్లలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు థియేటర్లకు అనుమతించొద్దని హైకోర్టు ఆదేశించింది.
Mon, 27 Jan 202504:44 PM IST
Ration Cards : తెలంగాణలో నాలుగు సంక్షేమ పథకాల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రోజు రైతు భరోసా కింద 4,41,911 మంది రైతుల అకౌంట్లలో రూ.530 కోట్ల రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. అలాగే 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేశామన్నారు.
Mon, 27 Jan 202504:07 PM IST
Hanamkonda Accident : హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
Mon, 27 Jan 202512:31 PM IST
- Warangal : వరంగల్ నగరంలోని డంప్ యార్డును తరలించాలని.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉద్యమం చేపట్టారు. డంప్ యార్డులోని చెత్త తగులబడి రోజుల తరబడి కాలుతుండటం, దాని నుంచి వచ్చే పొగ చుట్టుపక్కల గ్రామాలను కమ్మేస్తుండటంతో.. ఈ పోరాటం మొదలు పెట్టారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
Mon, 27 Jan 202512:13 PM IST
- TG Welfare Schemes : సంక్షేమ పథకాల కోసం పేదలు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న అధికారులు లంచాలకు తెగబడుతున్నారు. తాజాగా సత్తుపల్లిలో ఓ వార్డు ఆఫీసర్ ఏసీబీకి చిక్కారు.
Mon, 27 Jan 202510:09 AM IST
- Nizamabad : మూడు దశాబ్దాల కిందట తెలంగాణ పల్లెల పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. అందుకు ఉదాహరణే పూర్వపు నిజామాబాద్ జిల్లాలోని తిప్పాపూర్ విలేజ్. ఒకప్పుడు ఆ గ్రామం నక్సలిజానికి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు అది సైనికుల గ్రామంగా మారింది. ఇప్పటికే 18 మంది ఆర్మీలో చేరారు. అలాంటి గ్రామం గురించి ప్రత్యేక కథనం.
Mon, 27 Jan 202507:49 AM IST
- Indiramma Atmiya Bharosa : భూమిలేని నిరుపేద కూలీల కోసం.. రేవంత్ సర్కారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఏడాదికి రూ.12 వేలు అర్హులకు అందివ్వనున్నారు. అయితే.. ఈ పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mon, 27 Jan 202507:07 AM IST
- Hyderabad : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త దారి వెతుక్కొని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా లెహంగా పేరిట ఓ మహిళను మోసం చేశారు. భారీ డిస్కౌంట్ పేరుతో ఈ మోసం జరిగింది. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో భారీ ఆఫర్లను నమ్మొద్దని స్పష్టం చేస్తున్నారు.
Mon, 27 Jan 202505:58 AM IST
- Telangana Rythu Bharosa Scheme Updates : రైతు భరోసా స్కీమ్ ను తెలంగాణ ప్రభుత్వం పట్టాలెక్కించింది. ఎకరానికి రూ. 6 వేల నగదును ఈ పథకం కింద అందించనుంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి వ్యవసాయశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. కావాల్సిన పత్రాలు, అర్హతల వివరాలను పేర్కొంది.
Mon, 27 Jan 202505:31 AM IST
- Warangal Accident : వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి మామునూరు సమీపంలో ఎర్రగా మారింది. పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది. ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తు కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆదివారం మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mon, 27 Jan 202504:38 AM IST
- TGSRTC Employees : తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యలను పరిష్కరించాలని.. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. సోమవారం నాడు సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ సమ్మెకు దిగనున్నారు.
Mon, 27 Jan 202503:58 AM IST
- Meerpet Murder: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట వివాహిత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లను వినియోగించి ఆనవాళ్లు చిక్కకుండా ఫ్లష్ చేసినట్టు గుర్తించారు.
Mon, 27 Jan 202502:06 AM IST
- Janagama News: రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంటిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో ఏర్పాటు చేసిన సభ ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రి పొంగులేటి సభకు హాజరు కావాల్సి ఉండగా, కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట లాఠీఛార్జీకి దారి తీసింది.
Mon, 27 Jan 202501:23 AM IST
- Minister Ponguleti: కరీంనగర్ లో రెండు రోజుల క్రితం కేంద్ర రాష్ట్ర మంత్రుల పర్యటనలో కలెక్టర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేయడంపై బక్క జడ్సన్ జాతీయ మహిళా కమీషన్ కు పిర్యాదు చేశారు. మరోవైపు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు అధికారులకు కలెక్టర్ మెమోలు జారీ చేశారు.