Telangana News Live January 12, 2025: Minister Ponguleti : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 12 Jan 202504:09 PM IST
Minister Ponguleti : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా ఆయన కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపుచేయడంతో ప్రమాదం తప్పింది.
Sun, 12 Jan 202503:52 PM IST
Manda Jagannadham : నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. మందా జగన్నాథం మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.
Sun, 12 Jan 202501:28 PM IST
Sankranti Special Trains : సంక్రాంతి రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తాజాగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోచ్ లను 16కు పెంచారు. 1128 ప్యాసింజర్ కెపాసిటీతో రేపటి నుంచి ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది.
Sun, 12 Jan 202511:52 AM IST
Kaushik Reddy Vs Sanjay Kumar : కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన మంత్రుల సమీక్ష రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఇరువురూ ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు.
Sun, 12 Jan 202509:15 AM IST
Mid Manair Canal : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి వద్ద సాగునీటి కాలువకు గండి పడింది. గ్రామంలోకి వరద పోటెత్తింది. పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పంట పొలాలు నీట మునిగాయి. గ్రామస్తులు ఆందోళన దిగగా, కాలువకు నీటిని నిలిపివేసి మరమ్మతు పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
Sun, 12 Jan 202507:50 AM IST
- TG Indiramma Housing Scheme Website : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రక్రియను సర్కార్ వేగవంతం చేసింది. ఈనెలాఖారులోగా ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఏమైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరించేందుకు ఇటీవలే వెబ్ సైట్ ను కూడా తీసుకొచ్చింది. అయితే ఫిర్యాదు ప్రక్రియ ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి..
Sun, 12 Jan 202506:19 AM IST
- Adilabad Nagoba Jatara 2025 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. పుష్య మాసం వచ్చిందంటే నేలవంక చూశాక మేస్రం వంశీయులు తమ ఆరాధ్య దైవమైన నాగోబాను కొలిచేందుకు సిద్ధమవుతారు.
Sun, 12 Jan 202503:17 AM IST
- TG Rythu Bharosa Scheme Guidelines Updates : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పంట పెట్టుబడి సాయం అందుతుందని ప్రకటించింది. డీబీటీ విధానంలో డబ్బులను జమ చేస్తారు.
Sun, 12 Jan 202501:25 AM IST
- Telangana Clean and Green Energy Policy 2025: అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్లో అమలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వివిధ దేశాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించాలని సూచించారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానంతో విద్యుత్ నష్టాలను తగ్గించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Sun, 12 Jan 202501:05 AM IST
- కరీంనగర్ లో ఇద్దరు నకిలీ పోలీసులను అరెస్ట్ చేశారు. పోలీస్ అవతారం ఎత్తి డబ్బులు వసూలు చేస్తున్న ఆ ఇద్దరిన్ని కటకటాల వెనక్కి పంపించారు. నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. కొత్తపల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.