Telangana News Live February 8, 2025: PM Kusum Scheme : రైతులకు అలర్ట్, కుసుమ్ స్కీమ్ లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు-ఈనెల 22 వరకు దరఖాస్తులు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 08 Feb 202505:00 PM IST
PM Kusum Scheme : పీఎం కుసుమ్ పథకం కింద పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు టీజీ రెడ్కో దరఖాస్తలు ఆహ్వానిస్తోంది. ఒక్కో రైతు కనిష్ఠంగా 0.5 మెగావాట్ల నుంచి గరిష్టంగా 2 మెగావాట్ల వరకు విద్యుదుత్పత్తి చేసేలా పథకాన్ని ఉద్దేశించారు. ఆసక్తి కలిగిన రైతులకు బ్యాంకు రుణం మంజూరు చేయనున్నారు.
Sat, 08 Feb 202503:53 PM IST
Bandi Sanjay : కాంగ్రెస్ కు దిల్లీ ప్రజలు గాడిద గుడ్డును బహుమతిగా ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుకు పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.
Sat, 08 Feb 202512:55 PM IST
TG New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది.
Sat, 08 Feb 202510:56 AM IST
- Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్నాయి. కాంగ్రెస్పై కారు పార్టీ సెటైర్లు వేస్తే.. ఆప్ పరాజయానికి కారణం బీఆర్ఎస్ భస్మాసుర హస్తమే అని చేయి పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు.
Sat, 08 Feb 202510:08 AM IST
- Hyderabad : తెలుగు నేల మీద మొదటి తరం పారిశ్రామిక వెత్తలలో ఒకరు వెలమాటి జనార్ధన రావు. హైడ్రాలిక్స్, నుమాటిక్స్ని పరిచయం చేశారు. అలాంటి వ్యక్తి హత్యకు గురయ్యారు. అది కూడా మనవడి చేతిలోనే. అవును.. ఆస్తి కోసం వెలమాటి జనార్ధన రావును ఆయన మనవడు కత్తితో పొడిచి చంపేశాడు.
Sat, 08 Feb 202506:23 AM IST
- Delhi election Results : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జీరో అయ్యింది. ఒక్క స్థానంలోనూ ఆధిక్యం చూపలేదు. అన్ని చోట్ల మూడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా కేటీఆర్ రాహుల్ గాంధీపై సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.
Sat, 08 Feb 202506:18 AM IST
- అమీన్పూర్ మున్సిపాలిటీలో లే ఔట్ల కబ్జాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. లే ఔట్ల సరిహద్దులను తేల్చేందుకు త్వరలోనే సమగ్ర సర్వే చేపడుతామని చెప్పారు. సర్వేతో అన్ని లెక్కలు తేల్చుతామని ప్రకటించారు.
Sat, 08 Feb 202505:25 AM IST
- BRS Harish Rao On Ration Card Applications : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావ్ ఫైర్ అయ్యారు. మీసేవా దరఖాస్తుల పేరిట రేషన్ కార్డుల విషయంలో మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? అని ప్రశ్నించారు.
Sat, 08 Feb 202504:02 AM IST
- Telangana Local Body Elections 2025 : తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా అధికాయ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే షెడ్యూల్ విడుదల కానుంది. అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని తాజా ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది.
Sat, 08 Feb 202502:42 AM IST
- కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మొత్తం 22 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు యూనివర్శిటీ అధికారులు రెడీ అవుతున్నారు.
Sat, 08 Feb 202501:13 AM IST
- ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఇవాళ కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది.