తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు - 12 మంది నామినేషన్లు ఉపసంహరణ
Telangana News Live February 13, 2025: TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు - 12 మంది నామినేషన్లు ఉపసంహరణ
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 13 Feb 202505:00 PM IST
తెలంగాణ News Live: TG MLC Elections 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు - 12 మంది నామినేషన్లు ఉపసంహరణ
- ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరో తేలింది. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో పట్టభద్రుల స్థానంలో భారీ సంఖ్యలో 56 మంది, టీచర్ల స్థానంలో 15 మంది పోటీలో నిలిచారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
Thu, 13 Feb 202503:12 PM IST
తెలంగాణ News Live: Rangareddy District Court : జిల్లా కోర్టులో షాకింగ్ ఘటన - జడ్జిపై చెప్పు విసిరిన నిందితుడు
- రంగారెడ్డి జిల్లా కోర్టులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కేసులోని కరణ్ సింగ్ అనే నిందితుడు… జడ్జిపై చెప్పు విసిరాడు. అత్యాచారం కేసులో పోక్సో కోర్టు… కరణ్ సింగ్ కి జీవితకాలం జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుతో కోపోద్రిక్తుడైన నిందితుడు చెప్పు విసిరినట్లు తెలిసింది. ఈ ఘటనపై న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.
Thu, 13 Feb 202511:11 AM IST
తెలంగాణ News Live: Errabelli Dayakar Rao : రేవంత్ రెడ్డిని దించడానికి 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు - ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
- మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని చెప్పారు. రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని కామెంట్స్ చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయన్నారు.
Thu, 13 Feb 202510:16 AM IST
తెలంగాణ News Live: BRS MLC Kavitha : 'పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం... ఇంతకింత చెల్లిస్తాం' - ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
- కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో మాట్లాడిన ఆమె… తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని… ఇంతకింత చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
Thu, 13 Feb 202508:25 AM IST
తెలంగాణ News Live: Hyderabad : మైక్రోసాఫ్ట్ నూతన భవనం ప్రారంభం.. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి : రేవంత్ రెడ్డి
- Hyderabad : ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటి మైక్రోసాఫ్ట్. దీనికి సంబంధించిన నూతన భవనాన్ని హైదరాబాద్లో నిర్మించారు. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్య ప్రాజెక్టుల గురించి వివరించారు.
Thu, 13 Feb 202506:47 AM IST
తెలంగాణ News Live: Hyderabad : ఫామ్హౌస్లో కోడిపందాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు
- Hyderabad : మొయినాబాద్ ఫామ్ హౌస్లో కోడి పందాల కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఇష్యూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు రెయిడ్ చేసి.. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
Thu, 13 Feb 202504:12 AM IST
తెలంగాణ News Live: Karimnagar : లండన్ నుంచి వాట్సాప్ కాల్.. ఎమ్మెల్యేను బెదిరించి జైలు పాలైన ఎన్నారై!
- Karimnagar : లండన్ నుంచి వాట్సాప్ కాల్లో ఎమ్మెల్యేను బెదిరించాడు. సప్త సముద్రాల దూరాన ఉన్న తనను ఎవరు ఏమి చేయలేరు అనుకున్నాడు. కానీ అనుకోకుండా కర్ణాటకకు వచ్చి పోలీసులకు చిక్కాడు. కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, 13 Feb 202502:05 AM IST
తెలంగాణ News Live: Karimnagar : జగిత్యాలపై కన్నేసిన కల్వకుంట్ల కవిత.. ఉపఎన్నిక వస్తే బరిలో నిలిచేందుకు సన్నాహాలు!
- Karimnagar : జగిత్యాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోకస్ పెట్టారా? సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు పావులు కదుపుతున్నారా? ఉపఎన్నిక వస్తే బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై పట్టు కోసం కవిత ప్రయత్నిస్తోందనే టాక్ ఉంది.
Thu, 13 Feb 202512:51 AM IST
తెలంగాణ News Live: Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
- Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తు నుంచి జీఆర్సీ ఫ్రేమ్ ఊడి పడింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ వాహనం ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. దీనిపై రివ్యూ చేస్తున్నట్టు పల్లోంజి సంస్థ వెల్లడించింది.