Telangana News Live December 7, 2024: TGPSC Group 2 Exams : తెలంగాణ గ్రూప్-2 పరీక్షలకు 1368 సెంటర్లు ఏర్పాటు, ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 07 Dec 202404:34 PM IST
TGPSC Group 2 Exams : గ్రూప్-2 పరీక్షలకు టీజీపీఎస్సీ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల కోసం రాష్ట్ర వ్యప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ నెల 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
Sat, 07 Dec 202403:23 PM IST
Khammam Cyber Crime : సైబర్ కేటుగాళ్ల వలలో పడిన విశ్రాంత ఉద్యోగి అక్షరాలా రూ.15 లక్షలు పోగొట్టుకున్నారు. హవాలా చేస్తున్నారని బెదిరించి, సీబీఐ, సుప్రీంకోర్టు సమన్లు పేరిట రూ.15 లక్షలు తమ ఖాతాలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.
Sat, 07 Dec 202412:03 PM IST
Adilabad Singer : పుష్ప2 సినిమా రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ సినిమాలో హిట్ సాంగ్ అయిన ఫీలింగ్స్ సాంగ్ ఆదిలాబాద్ కు చెందిన సింగర్ లక్ష్మిదాస్. ఈమె పాడిన జానపదాలు అందరినీ అలరించారు. ఓ బావో సైదులు, ఆనాడేమన్నంటిన తిరుపతి... తిన్నా తీరం పడతలే ఫోక్ సాంగ్స్ లక్ష్మిదాస్ కు పేరు తెచ్చిపెట్టాయి.
Sat, 07 Dec 202410:51 AM IST
- Invitation to KCR : చివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని.. మాజీ సీఎం కేసీఆర్ను ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెళ్లి కేసీఆర్ను ఆహ్వానించారు.
Sat, 07 Dec 202409:37 AM IST
Oil Palm Farmers : తెలంగాణ రైతాంగానికి ఆయిల్ పామ్ సిరులు కురిపిస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో పాటు ఏడాదిలోని రూ.7 వేలకు పైగా ధర పెరిగింది. ఒక్క సిరిసిల్ల జిల్లాలో 2100 ఎకరాలలో 700 మంది రైతులు ఈ పంటని సాగు చేస్తున్నారు.
Sat, 07 Dec 202408:40 AM IST
తెలంగాణలో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. పలు ప్రాంతాల్లో 3.0 తీవ్రతతో భూమి కంపించింది.
Sat, 07 Dec 202406:56 AM IST
- Telangana Police : ఓ దొంగ అంబులెన్స్ను చోరీ చేశాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు యాక్షన్ మూవీ రేంజ్లో ఛేజింగ్ చేశారు. దాదాపు గంటన్నర బీభత్సం సృష్టించిన ఆ దొంగ.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి గాయాలు అయ్యాయి. ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు.
Sat, 07 Dec 202406:13 AM IST
- Konda Surekha : మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి వేములవాడ ఆలయ ఈవో కారణంగా మంత్రిపై విమర్శలు వస్తున్నాయి. ఆలయ కోడెల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. కోడెలను నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తికి అప్పగించారని ప్రచారం జరుగుతోంది.
Sat, 07 Dec 202405:58 AM IST
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో టీజీపీఎస్సీ ఛైర్మన్ గా కూడా ఘంటా చక్రపాణి పని చేశారు.
Sat, 07 Dec 202405:03 AM IST
- TG Rythu Runa Mafi Scheme : తెలంగాణ రుణమాఫీ స్కీమ్ అమలు చేసిన సంగతి తెలిసిందే. 4 విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు. అయితే ఇంకా చాలా మంది రైతుల రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఇందులో ఉన్నారు.
Sat, 07 Dec 202403:59 AM IST
- TG Jawahar Navodaya Vidyalaya : తెలంగాణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో 7 జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Sat, 07 Dec 202402:28 AM IST
- యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు.
Sat, 07 Dec 202401:51 AM IST
- South Central Railway Sabarimala Trains : అయ్యప్త భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. మరో 22 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాచిగూడ, హైదరాబాద్, నాందేడ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఈ రైళ్లు నడవనున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
Sat, 07 Dec 202401:24 AM IST
- Telangana State Tourism Policy :ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసే విషయంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో చేరుకునేలా కన్వెన్షన్ సెంటర్ ఉండాలన్నారు. డిసెంబర్ 31లోపు కొత్త పర్యాటక విధానం తయారు చేయాలని స్పష్టం చేశారు.