మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం, ఢీకొన్న రెండు లారీలు - ముగ్గురు సజీవదహనం…!-three burned alive in a collision between two lorries in mahabubabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం, ఢీకొన్న రెండు లారీలు - ముగ్గురు సజీవదహనం…!

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం, ఢీకొన్న రెండు లారీలు - ముగ్గురు సజీవదహనం…!

మహబూబాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మరిపెడ శివారులో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గరు సజీవదహనమయ్యారు. ఘటనా స్థలికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు సజీవ దహనం

మహబూబాబాద్‌ జిల్లా పరిధిలోని మరిపెడ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం - వరంగల్‌ హైవేలోని ఎల్లంపేట స్టేజీ వద్ద ఇవాళ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్‌ సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ కాగా… పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.