గ్రూప్-2 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేసింది. మే 29 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. జూన్ 10 వరకు ఈ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది.
హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ (గతంలో శ్రీ పొట్టి శ్రీరాములు వర్సిటీ)లో గ్రూప్ 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అలాగే.. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
గ్రూప్ 2 ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచారు. హాల్ టికెట్ నెంబర్లను పేర్కొన్నారు. టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… అభ్యర్థులు వెరిఫికేషన్ కు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ స్వయంగా సంతకం చేసిన ఫొటో కాపీలు తీసుకురావాల్సి ఉంటుంది.
తేదీల వారీగా షెడ్యూల్ వివరాలను మే 26వ తేదీన వెబ్ సైట్ లో ఉంచుతారు. మే 27 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం