సరస్వతీ నదీ పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు పుష్కరాలు జరగనుండగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రోజుకో లక్ష మంది భక్తులు తరలి వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సరస్వతీ పుష్కరాలకు భక్తులను తరలించేందుకు ఆర్టీసీ రెడీ అయ్యింది. వరంగల్ రీజియన్ తో పాటు హైదరాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ బస్సులు, ఛార్జీలను ఖరారు చేశారు.
సరస్వతీ పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
ఇందులో హైదరాబాద్, మంచిర్యాల, కరీంనగర్ తో పాటు వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ, పరకాల, భూపాలపల్లి, తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్ డిపోల నుంచి బస్సులు నడిపించేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సరస్వతీ పుష్కరాలకు వెయ్యి బస్సులు నడిపించేందుకు ప్రణాళిక రెడీ చేయగా.. అందులో వరంగల్ రీజియన్ నుంచే 790 బస్సులతో 1,580 ట్రిప్పులు తిప్పేందుకు చర్యలు చేపట్టారు. ఇక హైదరాబాద్ నుంచి దాదాపు వందకుపైగా బస్సులు నడిపించనున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి 50, మంచిర్యాల జిల్లా నుంచి మరో 50కిపైగా బస్సులు తిప్పనున్నారు. సరస్వతీ నదీ పుష్కరాల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా బస్సులు నడపనుండగా, అందులో డీలక్స్, సెమీ డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, ఇతర ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. దీంతో అధికారులు ఈ ప్రత్యేక బస్సులలో పిల్లలు, పెద్దలకు వేర్వేరుగా ఛార్జీలు కూడా ఖరారు చేశారు.
ఇందులో ఉమ్మడి వరంగల్ లోని డిపోలతో పాటు హైదరాబాద్ నుంచి స్పెషల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. నార్మల్ ఛార్జీలకంటే దాదాపు 1.5 శాతం పెంచి, స్పెషల్ బస్సుల్లో వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..
హనుమకొండ నుంచి పరకాల మీదుగా కాళేశ్వరం(ఎక్స్ ప్రెస్)రూ.250 - 140
హనుమకొండ నుంచి పరకాల మీదుగా కాళేశ్వరం(ఈ–ఎక్స్ ప్రెస్)రూ. 260 150
హనుమకొండ నుంచి పరకాల మీదుగా కాళేశ్వరం(డీలక్స్ సర్వీస్) 290 160
హనుమకొండ నుంచి పరకాల మీదుగా కాళేశ్వరం (సెమీ డీలక్స్) 270 150
హనుమకొండ నుంచి పరకాల మీదుగా కాళేశ్వరం (ఈ–డీలక్స్) 310 180
హనుమకొండ నుంచి పరకాల మీదుగా కాళేశ్వరం (సూపర్ లగ్జరీ) 330 190
హనుమకొండ నుంచి పరకాల మీదుగా కాళేశ్వరం(ఈ–సూపర్ లగ్జరీ) 350 210
హనుమకొండ నుంచి పరకాల మీదుగా కాళేశ్వరం(రాజధాని) 420 330
హనుమకొండ నుంచి పరకాల మీదుగా కాళేశ్వరం(గరుడ ఎక్స్ప్రెస్) 500 380
నర్సంపేట నుంచి హనుమకొండ మీదుగా కాళేశ్వరం(ఎక్స్ ప్రెస్) 330 180
నర్సంపేట నుంచి ములుగు మీదుగా కాళేశ్వరం(ఎక్స్ ప్రెస్) 310 170
మహబూబాబాద్ నుంచి హనుమకొండ మీదుగా కాళేశ్వరం(ఎక్స్ ప్రెస్) 420 220
మహబూబాబాద్ నుంచి ములుగు మీదుగా కాళేశ్వరం(ఎక్స్ ప్రెస్) 400 220
తొర్రూరు నుంచి హనుమకొండ మీదుగా కాళేశ్వరం(ఎక్స్ ప్రెస్) 360 190
జనగామ నుంచి కాళేశ్వరం(ఎక్స్ ప్రెస్) 390 220
భూపాలపల్లి నుంచి కాటారం మీదుగా కాళేశ్వరం(ఎక్స్ ప్రెస్) 120 70
భూపాలపల్లి నుంచి కాటారం మీదుగా కాళేశ్వరం(సూపర్ లగ్జరీ) 160 100
పరకాల నుంచి కాళేశ్వరం(ఎక్స్ ప్రెస్) 190 110
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం(డీలక్స్) 670 370
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం (సెమీ డీలక్స్) 630 350
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం(సూపర్ లగ్జరీ) 760 420
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం(రాజధాని) 960 740
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం(గరుడ ప్లస్) 1130 870
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం(ఎక్స్ ప్రెస్) రూ.570-రూ 320
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం