TG Govt Hostels Food : గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇకపై లంచ్ లో మటన్ కూడా-tg govt good news to social welfare hostel students serving mutton on diet menu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Hostels Food : గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇకపై లంచ్ లో మటన్ కూడా

TG Govt Hostels Food : గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇకపై లంచ్ లో మటన్ కూడా

Bandaru Satyaprasad HT Telugu
Dec 14, 2024 04:59 PM IST

TG Govt Hostels Food : సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం నోరూరించే విషయం చెప్పింది. ఇకపై లంచ్ లో నెలలో రెండు సార్లు మటన్, నాలుగు సార్లు చికెన్ పెట్టనున్నట్లు ప్రకటించింది. మిగిలిన రోజులు గుడ్డు పెట్టనున్నట్లు తెలిపింది.

గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇకపై లంచ్ లో మటన్ కూడా
గురుకుల విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇకపై లంచ్ లో మటన్ కూడా

TG Govt Hostels Food : గురుకుల పాఠశాలల్లో ఇటీవల వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపాయి. ఓ విద్యార్థిని సైతం మృతి చెందడం, విషయం హైకోర్టు వరకూ వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌పై ఫోకస్‌ పెట్టింది. తనిఖీల పేరిట గురుకులాల బాటపట్టింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం హాస్టల్స్‌, గురుకులాల్లో తనిఖీలు చేపట్టారు.

yearly horoscope entry point

హాస్టళ్లలో ఇకపై మటన్ కూడా

ఇకపై హాస్టల్‌ విద్యార్థులకు రుచికరమైన, పోషకాహారం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం అందిస్తున్న డైట్‌లో పలు మార్పులు చేస్తూ పౌష్టికాహార మెనూ సిద్ధం చేసింది. ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతి ఆదివారం చికెన్ పెడుతున్నారు. అయితే ఇకపై విద్యార్థులకు మటన్ కూడా పెట్టబోతున్నారు. లంచ్ లో నెలలో రెండు సార్లు మటన్, నాలుగు సార్లు చికెన్ పెట్టనున్నారు. నాన్ వెజ్ ఆహారం పెట్టినప్పడు సాంబార్, పెరుగు కూడా పెడతారు. నాన్ వెజ్‌‌‌‌‌‌‌‌ తినని విద్యార్థులకు ఆ రోజుల్లో మీల్ మేకర్ వంటకం పెడతారు. నాన్ వెజ్ లేని మిగతా రోజుల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు అందిస్తారు.

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడిగా మాత్రమే చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కామన్ డైట్‌ను ప్రారంభించారు. పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులతో కలిసి భోజనం చేశారు.

అంతకముందు జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రమాణాలను పెంచాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెంచడానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థలతో పోల్చితే ప్రభుత్వ స్కూళ్లల్లో క్వాలిఫైడ్ టీచర్లు, మంచి వసతులు, మంచి జీతాలు ఉన్నా, ఎందుకు ప్రమాణాలు పెంచలేకపోతున్నామో ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉందన్నారు.

వాళ్లే రాష్ట్ర సంపద

"రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 లక్షల మంది చదువుతుంటే, 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో టాలెంట్ ఎక్కువగా ఉంటుందని, ప్రభుత్వ స్కూళ్లలో తక్కువగా ఉంటదన్న అపోహను తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ స్కూళ్లల్లో చదువుతున్న వారు అనాథలు కాదు. వాళ్లు రాష్ట్ర సంపద అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. 8 ఏళ్ల నుంచి డైట్ ఛార్జీలను పెంచలేదు. 16 ఏండ్లుగా కాస్మొటిక్ ఛార్జీలను పెంచలేదు. ప్రజా ప్రభుత్వం అన్నీ పరిశీలించి 40 శాతం మేరకు డైట్ ఛార్జీలను 212 శాతం కాస్మొటిక్ ఛార్జీలను పెంచాం"- సీఎం రేవంత్ రెడ్డి

ప్రతి నెలా డైట్ ఛార్జీలు విడుదల

గతంలో ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి డైట్ ఛార్జీలు విడుదల చేసేవారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ప్రతి నెలా 10వ తేదీలోగా గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో కూడా రెసిడెన్షియల్ స్కూళ్లను పరిశీలిస్తామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు. విద్యార్థులతో మెస్ మేనేజ్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి వారిని భాగస్వాములను చేయడం ద్వారా వారికి అవసరమైన ఆహారాన్ని వారే ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.

ప్రతిసారీ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టడం కాకుండా ఎంతో ముందుగానే పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్ బాధ్యతను రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. కుట్టు పనికి ఇచ్చే రుసుమును కూడా రూ.25 నుంచి రూ.75 కు పెంచామన్నారు. స్కూళ్లకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. వారంలో రెండు మూడు రోజులు రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించామని చెప్పారు.

Whats_app_banner

సంబంధిత కథనం