Harish Rao On Budget : బట్టీ, బడా జూట్ బడ్జెట్- అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏంలేవ్ : హరీశ్ రావు-tg budget criticized harish rao alleges falsehoods and overstatements filled with false claims ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao On Budget : బట్టీ, బడా జూట్ బడ్జెట్- అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏంలేవ్ : హరీశ్ రావు

Harish Rao On Budget : బట్టీ, బడా జూట్ బడ్జెట్- అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏంలేవ్ : హరీశ్ రావు

Harish Rao On Budget : బట్టీ బడ్జెట్-బడా జూట్ బడ్జెట్ అంటూ తెలంగాణ బడ్జెట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. బడ్జెట్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ అబద్ధాలు, అసత్యాలు చెప్పిందని ఆరోపించారు. రెవెన్యూ సర్ ప్లస్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంలో చిత్రీకరించారన్నారు.

బట్టి, బడా జూట్ బడ్జెట్- అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏంలేవ్ : హరీశ్ రావు

Harish Rao On Budget : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చూస్తే రాజకీయ ప్రసంగంలాగా ఉందన్నారు. పచ్చి అబద్దాలు, అసత్యాలు చెప్పారన్నారు. బట్టి బడ్జెట్ - బడా జూట్ బడ్జెట్, ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. ఈరోజు బడ్జెట్ లో అబద్ధాలు, అతిశయోక్తులు తప్ప ఏమి లేవన్నారు.

"ఎన్నికల ముందు అన్ని చేస్తాం ,అధికారంలోకి రాగానే ఏమి చెయ్యమనే మాదిరి ఈ బడ్జెట్ ప్రసంగం ఉన్నది. ఎన్నికల ముందు ఏం అడిగితే అది ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బయట, అసెంబ్లీలో అబద్ధాలే మాట్లాడుతున్నాడు. లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నం అన్నారు. 20 వేల కోట్లు ఇచ్చినం అంటున్నారు. గతేడాది వచ్చే ఏడాది లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం అన్నారు.

మొత్తం వర్తిస్తదా అంటే లేదు 5 లక్ష వరకే వర్తిస్తది అని జీవో 27 ప్రకారం అని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. 5 లక్షల వరకే వడ్డీ లేని రుణం, మిగతా 15 లక్షలకు మహిళలే వడ్డీలు కడుతున్నారు. తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెబుతున్నది నిజం. అసెంబ్లీ సాక్షిగా మహిళలందర్ని ప్రభుత్వం మోసం చేసింది" -మాజీ మంత్రి హరీశ్ రావు

"స్కూల్ విద్యార్థుల డ్రెస్ కుట్టు ఛార్జీలు రూ.75 ఇస్తున్నా అంటున్నారు. గత బడ్జెట్ లోనూ ఇదే చెప్పారు, మక్కీకి మక్కీ కాపీ కొట్టారు. ఈ ప్రభుత్వం నిజంగా ఇస్తున్నది 50 రూపాయలు మాత్రమే. 75 ఇచ్చినట్లు రెండు బడ్జెట్లలో చెప్పుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని బడ్జెట్ లో చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నా, బీఆర్ఎస్ 6 లక్షల 47 వేల రేషన్ కార్డులు ఇచ్చింది.

72 పేజీల భట్టి ప్రసంగం గురించి చెప్పాలంటే బడ్జెట్ లో రెండు పేజీలు పెరిగింది తప్ప, పేదల సంక్షేమం పెరగలేదు. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక కూడా అబద్దాలు. సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని, ఈ బడ్జెట్ లో అయినా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా చూశారు. మహాలక్ష్మి ఊసే లేదు. రూ.2500 లేదు గానీ, రూ.2500 కోట్ల అందాల పోటీల కోసం బడ్జెట్ లో పెట్టారు" - మాజీ మంత్రి హరీశ్ రావు

తులం బంగారం కేటాయింపులేవి?

"చేయూత కింద 4000 పింఛన్ అన్నారు. అతీ గతీ లేదు. వృద్ధులు, గీత, చేనేత, ఎయిడ్స్ పేషెంట్లను మోసం చేసింది కాంగ్రెస్. కొత్త పింఛన్ ఇయ్యలేదు, ఉన్న పింఛన్ రెండు నెలలు ఎగ్గొట్టారు. లక్షా 50 వేల పింఛన్లు తగ్గినాయి. కోత పెట్టారు. రుణమాఫీ అయినోళ్లు తక్కువ, కానోళ్లు ఎక్కువ. రుణమాఫీ అయిపోయినట్లు చేస్తున్నారు. మిగతా వాళ్లకు ఎప్పుడిస్తారు.

రెండు లక్షలపై మీద ఉన్నవాళ్లకు కాలేదు, లోపు ఉన్న వాళ్లకు కాలేదు. నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న 10,150 మందికి రుణమాఫీ కాలేదు. ఎక్కడి వెళ్దాం, ఎక్కడైనా చర్చకు నేను సిద్దం. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారు. తులం బంగారం కేటాయింపులు లేవు. గత బడ్జెట్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అన్నారు, ఈ ఏడాది పన్నెండు పూర్తి చేస్తామన్నారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి అయిందా అయితే ఒక్క దాని పేరు చెప్పండి"- మాజీ మంత్రి హరీశ్ రావు

" బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ జీఎస్డీపీ గ్రోత్ రేటు 12.9 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.1 శాతం అన్నారు. 2.8 శాతం ఎందుకు తగ్గింది. తలసరి ఆదాయం మా పాలనలో 12.4శాతం. కాంగ్రెస్ పాలనలో 9.6శాతం. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అప్పులు అప్పులు అంటున్నారు. బడ్జెట్ పుస్తకాలు చూస్తే రెవెన్యూ సర్ ప్లస్ సేట్ అని చెబుతుంది. గతేడాది రూ.5888 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది. ఈ బడ్జెట్ లో రూ.2738 కోట్ల సర్ ప్లస్ ఉంటదని ప్రతిపాదించారు.సర్ ప్లస్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చిత్రీకరించారు. మీ ఆలోచన విధానం వల్ల దివాలా తీసింది. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చుతున్నారు. పుస్తెల తాళ్లు తెంచుతున్నారు. ఈ ఏడాది ఎక్సైజ్ ద్వారా రూ.50 వేల కోట్ల రాబడి ఆశిస్తున్నారు" -మాజీ మంత్రి హరీశ్ రావు

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.