రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది.
యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా కూడా రామప్ప గుర్తింపు పొందిన సంగతి కూడా తెలిసిందే. ఈ ఆలయాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
"UNESCO World Heritage Site - Ramappa Temple' పేరుతో హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఏసీ మినీ బస్సులో జర్నీ ఉంటుంది. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో జర్నీ ఉంటుంది.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2800గా ఉంది. పిల్లలకు 2,240గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
NOTE: హైదరాబాద్ - రామప్ప టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=352&journeyDate=2024-11-17&adults=2&childs=0
సంబంధిత కథనం