Telangana Tourism Temple Tour Package 2024: ప్రముఖ అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా..? బడ్జెట్ ధరలోనే వెళ్లాలని అనుకునే వారికోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). Temple Tour (Kakatiya Region) పేరుతో హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. బస్సులో రోడ్డు మార్గాన ఈ ట్రిప్ సాగుతుంది. ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంంబధించి వివరాలను ఇక్కడ చూడండి…
-రాత్రి 10 గంటలకు యాత్రినివాస్ కు చేరుకుంటారు.
-05.00 AM - కాళేశ్వరం బయల్దేరుతారు.
-ఉదయం 7 గంటలలోపు కాళేశ్వరం దర్శనం చేసుకుంటారు.
-ఉదయం 7 తర్వాత…. రామప్పకు బయల్దేరుతారు.
-11 గంటల వరకు రామప్పుకు చేరుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత దర్శనం ఉంటుంది.
-11 గంటల తర్వాత….. రామప్ప నుంచి వరంగల్ కు బయల్దేరుతారు.
-02.30 గంటలకు వరంగల్ చేరుకుంటారు. హారిత హోటల్ లో భోజనం ఉంటుంది.
-02.30 PM - హన్మకొండ నుంచి యాదాద్రికి చేరుకుంటారు.
-04.30 PM to 06.00 PM - యాదాద్రి దర్శనం పూర్తి అవుతుంది.
-06.00 PM - యాదాద్రి నుంచి కీసరకు బయల్దేరుతారు.
-07.15 PM to 08.00 PM - కీసరగుట్టకు చేరుకుంటారు.
-08.00 PM - హైదరాబాద్ కు బయల్దేరుతారు.
-09.00 PM - హైదరాబాద్ కు చేరుకుంటారు.
తెలంగాణ టూరిజం ప్రకటించిన ఈ టెంపుల్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. పెద్దలకు 2999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 2399గా ఉంది. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. https://tourism.telangana.gov.in/p వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Papikondalu Tour 2024: మరోవైపు తెలంగాణ టూరిజం(Telangana Tourism) స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మొత్తం మూడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. బస్సులో రోడ్డు మార్గం ద్వారా జర్నీ ఉంటుంది. అదనంగా గోదావరిలో బోటింగ్ ఉంటుంది.
Hyderabad - Papikondalu Tour Prices 2024: హైదరాబాద్ - పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు 6999గా నిర్ణయించారు. పిల్లలకు 5599గా ఉంది . నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. బోట్ లో భోజనం ఇస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 1800-425-46464 నెంబర్ కు కాల్ చేయవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.