TS Temperatures : నిప్పుల గుండంగా నల్గొండ - ఇవాళ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు!-telangana records 46 8 degrees celsius on june 2 its hottest day of this year ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Telangana Records 46.8 Degrees Celsius On June 2 Its Hottest Day Of This Year

TS Temperatures : నిప్పుల గుండంగా నల్గొండ - ఇవాళ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 02, 2023 06:17 PM IST

Temperatures Updates: రాష్ట్రంలో భానుడి ప్రతాపం మళ్లీ పెరిగిపోతుంది. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమ్మర్ సీజన్ ప్రకారం చూస్తే… ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణలో మండుతున్న ఎండలు
తెలంగాణలో మండుతున్న ఎండలు

Today Telangana Temperatures : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. ఓవైపు మొన్నటి వరకు పలుచోట్ల వర్షాలు కురిసినప్పటికీ… మళ్లీ ఎండల ప్రభావం పెరిగిపోయింది. ఈ సమ్మర్ సీజన్ లో ఇవాళే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇవాళ్టి ఉష్ణోగ్రతల వివరాలు
ఇవాళ్టి ఉష్ణోగ్రతల వివరాలు

శుక్రవారం(జూన్ 2) నల్గొండ జిల్లాలోని దామరచర్లలో 46. 8 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవ్వగా… పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని తన్గులా ప్రాంతంలో- 45.9, సూర్యాపేట జిల్లాలోని మునగాలలో - 45.7 డిగ్రీలు, జయశంకర్ జిల్లాలోని మహాదేవ్ పూర్ - 45.6, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జామ్ బుగ్గ -45.6 డిగ్రీలు, సూర్యాపేట జిల్లాలోని పెద్దవీడు -45.5, కొత్తగూడెంలోని యానంబయలు - 45.4, ములుగు జిల్లాలోని తాడ్వాయి మండల పరిధిలో 45.4, సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండల పరిదిలో - 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

ఇక హైదరాబాద్ లోనూ ఎండల తీవ్రత బాగానే ఉంది. కానీ జిల్లాలతో పోల్చితే కాస్త తక్కువగా ఉంది. ఇవాళ ఖైరతాబాద్ లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి - 42.3, షేక్ పేట- 41.2, ముషీరాబాద్ - 41.2, కూకట్ పల్లి - 41.2, సికింద్రాబాద్ - 41.2, రామచంద్రాపురం - 41.2, చార్మినార్ - 41.2, అసిఫ్ నగర్ - 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

ఏపీలోని ఈ ప్రాంతాలకు హెచ్చరికలు

శనివారం విజయనగరం, మన్యం,అల్లూరి, కాకినాడ,కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,ప్రకాశం మరియు SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల 40°C - 44°Cల నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 8 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 256 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 127 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ చూస్తే 10 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 105 మండలాల్లో వడగాల్పులు వీచాయని వివరించింది.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.