తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు-telangana jagruthi files complaint against teenmar mallanna with state womens commission ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

HT Telugu Desk HT Telugu

మల్లన్న వ్యాఖ్యలు మహిళల పట్ల అగౌరవాన్ని, అసభ్యతను ప్రదర్శిస్తున్నాయని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి నేతలు మహిళా కమిషన్‌ను కోరారు.

ఫిర్యాదు అందజేస్తున్న నేతలు

హైదరాబాద్, జూలై 14, 2025: తీన్మార్ మల్లన్నగా పేరుపొందిన చింతపండు నవీన్‌పై తెలంగాణ జాగృతి మహిళా విభాగం నేతలు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు ఈ ఫిర్యాదును అందజేశారు.

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో, తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు తమ ఫిర్యాదు లేఖను కమిషన్ సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమ, అప్రోజ్ సహీనాలకు అందజేశారు.

కాగా ఛైర్‌పర్సన్ అందుబాటులో లేనందున తాను ఫిర్యాదు లేఖను తీసుకోనని, సభ్యులకే ఇవ్వాలని సూచించి మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజా రమణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సభ్యులకు లేఖను సమర్పించారు.

మల్లన్న తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోగా, ఈరోజు అంతకన్నా తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ కవితను దూషించిన విషయాన్ని జాగృతి నేతలు మహిళా కమిషన్‌కు వివరించారు. మల్లన్న వ్యాఖ్యలు మహిళల పట్ల అగౌరవాన్ని, అసభ్యతను ప్రదర్శిస్తున్నాయని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కమిషన్‌ను కోరారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.