తెలంగాణ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఫలితాలను విడుదల చేశారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణాదిత్యలతో కలిసి ఫలితాలను మంత్రి భట్టి విడుదల చేశారు.
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు 9,97,012 మంది హాజరయ్యారు. 66.89 శాతం మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులు కాగా, సెకండియర్ 71.3 శాతం ఉత్తీర్ణలయ్యారు. మొదటి ఏడాది పరీక్ష, 4,88, 438మంది బాలికలు 73.8శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో బాలురు 57.83శాతం ఉత్తీర్ణులయ్యరు.
రెండ ఏడాది 5,08,582మంది హాజరయ్యారు. వీరిలో బాలికలు 74.21శాతం ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాది 57.31 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించిన సిబ్బందిని మంత్రి అభినందించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత గత ఐదేళ్లతో పోలిస్తే మెరుగు పడింది. 2021లో కోవిడ్ కారణంగా విద్యార్థులందరిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు. 2022లో 60.12 శాతం, 2023లో 66.81శాతం, 2024లో 63.86శాతం, 2025లో 67.44శాతం ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ఫిర్యాదుల కోసం 92402 05555 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ రెగ్యులర్, ప్రైవేట్, జనరల్, ఒకేషనల్ ఫలితాలను విడుదల చేశారు. వారం రోజుల పాటు రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
అడ్వాన్స్సప్లిమెంటరీ పరీక్షల ఫీజులను ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కాలేజీల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలను జూన్ 3 నుంచి ఆరో తేదీ వరకు నిర్వహిస్తారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహిస్తారు.
సంబంధిత కథనం