TG IPS Transfers : తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం...తాజాగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ బాధ్యతలు నిర్వర్తించిన ఎల్ సుబ్బారాయుడిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 20 మంది అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో ఎక్కువగా కలెక్టర్లు ఉన్నారు.
సంబంధిత కథనం