వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూ భారతి చట్టానికి ఆమోదముద్ర పడిన నేపథ్యంలో… క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవహారాలను నిర్వహించేందుకు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించేందుకు సిద్ధమైంది. గతంలో పని చేసిన ఉద్యోగులను తిరిగి రప్పించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చింది.
రెవెన్యూ వ్యవస్థలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాలు తెలపాలని ఇటీవలే ప్రకటన కూడా డారీ చేసింది. ఇందుకు డిసెంబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఇప్పటికే పలువురు ఉద్యోగులు… మళ్లీ చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేయగా… వారందర్నీ వేర్వురు శాఖల్లో సర్దుబాటు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన జారీ చేయగా.. వీరిలో కొందరు రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం 10,911 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయానికి వచ్చింది. గతంలో మాదిరిగా వీఆర్వో, వీఆర్ఏ లు కాకుండా… కేవలం ఒక్క అధికారే ఉండనున్నారు. విలేజ్ లెవర్ ఆఫీసర్ లేదా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ పేరుతో వీరిని రిక్రూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సంబంధిత కథనం