రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఈ నెలాఖరులోగా ఖాతాల్లో డబ్బులు-telangana farmers good news rythu bharosa payments expected by may month end ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఈ నెలాఖరులోగా ఖాతాల్లో డబ్బులు

రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఈ నెలాఖరులోగా ఖాతాల్లో డబ్బులు

తెలంగాణ ప్రభుత్వం త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. మే చివరి నాటికి రబీ సీజన్ రైతు భరోసా డబ్బులు నాలుగు నుచి పది ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు నిధులు జమ చేయనున్నారని సమాచారం. నిధుల సమకూర్చుకోవడంపై సీఎం ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం.

రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, ఈ నెలాఖరులోగా ఖాతాల్లో డబ్బులు

తెలంగాణ ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.

నాలుగు ఎకరాల వరకూ

రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం సీజన్ కు ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేస్తుంది. మొత్తం రెండు సీజన్లలో రూ.12 వేలు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ ఏడాది జనవరి 26న రైతు భరోసా పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఫిబ్రవరి 5, 11 తేదీల్లో రెండు దశల్లో నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు డబ్బులు జమ చేశారు.

మే చివరి నాటికి నిధులు జమ

నాలుగు ఎకరాలు, ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా డబ్బులు అందలేదు. పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రబీ సీజన్‌కు నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

రైతు భరోసా నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్ది ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. వచ్చే వారంలో రైతు భరోసాపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్ష అనంతరం రైతు భరోసా చెల్లింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సీజన్ కు రూ.6 వేలు చొప్పున

ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల జమ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రబీ సీజన్ లో భాగంగా రైతుల అకౌంట్లలోకి రూ.6 వేల చొప్పున నిధులను జమ చేశారు. మూడు దశల్లో నాలుగు ఎకరాల వరకు రైతులకు నిధులు అందించారు.

35 లక్షల మంది రైతులు

ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఎకరాలకిపైగా భూమి కలిగిన రైతులు దాదాపు 35 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రబీ సీజన్‌ లో డబ్బులు జమ కానీ వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. మే చివరి నాటికి వారి ఖాతాల్లో పెట్టుబడిసాయం నిధులు జమ అవుతాయని ఆశిస్తున్నారు.

జులై నుంచి ఖరీఫ్ సీజన్ నిధులు

జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో జూన్ నెల లోగా రబీ సీజన్‌కు రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జులై నుంచి ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తుంది. ఈ అంశంపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం