తెలంగాణలో భూప్రకంపనలు, భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు-telangana earth tremors hit karimnagar and siricilla residents flee in fear ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణలో భూప్రకంపనలు, భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు

తెలంగాణలో భూప్రకంపనలు, భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు

తెలంగాణలో భూమి కంపించింది. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత 3.8 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

తెలంగాణలో భూప్రకంపనలు, భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు

తెలంగాణలో భూమి కంపించింది. క‌రీంన‌గ‌ర్, సిరిసిల్ల,జగిత్యాల, వేములవాడ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం అని భ‌యంతో ప్రజలు బ‌య‌టికి ప‌రుగులు తీశారు. రెండుసార్లు భూమి తీవ్రంగా కంపించిందని స్థానికులు అంటున్నారు. క‌రీంన‌గ‌ర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భ‌వ‌నాలు, ఇండ్లు కంపించాయి.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు

కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా భూప్రకంపనలు వచ్చాయి. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. నిర్మల్‌ జిల్లాలోనూ పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

కరీంనగర్ లో సోమవారం సాయంత్రం సుమారు 6:52 నిమిషాలకు భూమి రెండుసార్లు కంపించిందని హెచ్.టి.తెలుగుతో స్థానికులు తెలిపారు.

ఆదిలాబాద్ లో భూకంపనలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైతం భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భూకంపం

జగిత్యాల జిల్లా మెట్ పల్లి, కోరుట్ల పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనాలు వచ్చాయి. సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూమి ఊగినట్లు అనిపించడంతో చాలా మంది భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో భూమి కంపించింది.

రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది. జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ప్రాంతాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది. ధర్మపురి, సిరిసిల్ల, సుల్తానాబాద్‍లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 3.5 గా భూకంప తీవ్రత నమోదు అయ్యింది.

నాలుగు నెలల వ్యవధిలో రెండోసారి

ఇళ్లలోని సామాగ్రి సైతం కదిలిపోవడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో బయటకు పరుగులు తీశారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు నెలల వ్యవధిలో ఇలా భూమి కంపించడం రెండోసారి, దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చాయి.

పులికుంట కేంద్రంగా భూకంపం

సోమవారం సాయంత్రం గం. 6:50:22 లకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పులికుంట కేంద్రంగా భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాలలోని పలుప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది. భూకంప తీవ్రత 3.8 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం