పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై దాడుల నేపథ్యంలో సాయుధ బలగాలకు అండగా ఉంటామని తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించారు.
భారతీయ పౌరులుగా మన సాయుధ దళాలకు అండగా నిలవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద కర్మాగారాలపై దాడులు మనల్ని గర్వపడేలా చేస్తున్నాయని ఇది జాతి మొత్తం సంఘీభావాన్ని , ఐక్యతను నిరూపించాల్సిన సమయమని, మనమందరం ఒకే గొంతుతో మాట్లాడదాం - జై హింద్!" అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఉగ్రవాదం పట్ల ప్రపంచం జీరో టాలరెన్స్ చూపించాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
పాకిస్తాన్ భూభాగంత పాటు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న "ఆపరేషన్ సింధూర్" బుధవారం తెల్లవారు జామున జరిగింది.
ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో 25 మంది భారతీయులతో పాటుఒక నేపాలీ పౌరుడిని చంపిన ఉగ్రవాద దాడికి 14 రోజుల తర్వాత భారత సైన్యం తీవ్రంగా ప్రతిస్పందించింది.
గత ఐదు దశాబ్దాల్లో పాక్ భూభాగంలో భారత్ చేపట్టిన అత్యంత ముఖ్యమైన సైనిక చర్య ఇది. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు ప్రతీకారం తీర్చుకునేందుకు, భారత్ లో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన జైషే మహ్మద్, లష్కరే తోయిబా నేతలను అంతమొందించేందుకు ఈ దాడులు జరిగాయి.
బహవల్పూర్, మురిడ్కే, సియాల్కోట్ సహా పాకిస్తాన్లోని నాలుగు, పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (పీఓజేకే)లోని ఐదు ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు ప్రత్యేక కచ్చితమైన ఆయుధాలను ఉపయోగించి విజయవంతంగా దాడి చేశాయి. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలు సంయుక్తంగా ఆస్తులు, బలగాల సమీకరణతో ఈ ఆపరేషన్ చేపట్టాయి.
ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా ఆపరేషన్ సింధూరాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొత్తం తొమ్మిది లక్ష్యాలపై దాడులు విజయవంతమయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా అగ్రనేతలను లక్ష్యంగా చేసుకునేందుకు భారత బలగాలు ఈ ప్రాంతాలను ఎంచుకున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో భారత సాయుధ బలగాలకు ప్రజలు అండగా నిలవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
సంబంధిత కథనం