Telangana Cabinet : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం - మరికొన్ని కీలక నిర్ణయాలు..!-telangana cabinet approves sc classification draft bill key decisions details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Cabinet : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం - మరికొన్ని కీలక నిర్ణయాలు..!

Telangana Cabinet : ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం - మరికొన్ని కీలక నిర్ణయాలు..!

Telangana Cabinet Meeting Updates: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్… పలు నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బీసీ రిజర్వేషన్లతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించారు.

తెలంగాణ కేబినెట్ (ఫైల్ ఫొటో) (CMO Twitter)

తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి… కీలక సూచనలు చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కీలక నిర్ణయాలు…!

బీసీ రిజర్వేషన్లపై క్యాబినేట్‌ లో ప్రధానంగా చర్చ జరిగింది. ఇక మెట్రో రైల్ ఫేజ్-2, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డు, హెచ్ఎండీఏ యాక్ట్ లో మార్పులకు సంబధించి మరికొన్ని అంశాలు కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చాయి.

బడ్జెట్ సమావేశాలపై మంత్రివర్గంలో చర్చించారు. మార్చి 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్ని రోజులు నిర్ణయిస్తారనే దానిపై బీఏసీ సమావేశంలో డిసైడ్ చేస్తారు. ఇక భూభారతి చట్టం అమలు, LRS, మైనింగ్ యాక్ట్ అంశాలపై మంత్రివర్గం చర్చించింది.

భూ భారతి చట్టం అమలు నేపథ్యంలో 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేయనున్నారు. అయితే భూ భారతి చట్టాన్ని ఉగాది నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పది జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 55 ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.