Telangana Cabinet Meeting : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మారుస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇండియా స్కిల్స్ వర్శిటీ బిల్లుకు ఆమోదముద్ర వేసింది.
జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. కొత్త రేషన్ కార్డులను త్వరిగతిన మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.