TG Cabinet: తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణ యించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ అక్తర్ ఇచ్చిన సవరణ నివేదికకు మంత్రి మండలి అమోదం తెలిపింది.
తెలంగాణలో ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని సీఎం తెలిపారు. ఈ మేరకు జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో కమిషన్ నియమించగా.. ఫిబ్రవరి 3న నివేదిక ఇచ్చిందని వివరించారు. ఈ నివేదికలోని సిఫార్సులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించామన్నారు. కమిషన్ నివేదికను పునః పరిశీలించాలని వివిధ వర్గాల నుంచి 71 విజ్ఞప్తులు వచ్చాయని వాటిని పరిశీలించి సవరణ నివేదిక ఇవ్వాలని కమిషను ప్రభుత్వం కోరిందని వివరించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చట్టం తీసుకువచ్చేందుకు.. సవరణ నివేదికను కమిషన్ ఇచ్చింది. దాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు.
బీసీ కులగణన, రిజర్వేషన్ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. బీసీల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచేం దుకు ముసాయిదా బిల్లు మంత్రివర్గం ముందుకు వచ్చింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలకు వేర్వేరు బిల్లులు తీసుకువచ్చి.. తీర్మానం చేయాలని నిర్ణయించాం. గతంలో బీసీ రిజర్వేషన్లను 31 శాతానికి పెంచుతూ కేంద్రానికి పంపించిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోనున్నారు.
ఒక తీర్మానం పెండింగ్లో ఉన్నప్పుడు మరో తీర్మానం చేయడం కుదరనందువల్ల ఇందుకు నిర్ణయించినట్టు చెప్పారు ప్రభుత్వం చెప్పినట్లు బలహీనవర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా చట్టాన్ని తీసుకువచ్చి. అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందన్నారు.
బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనిపై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానం చేసినట్టు వివరించారు.
సంబంధిత కథనం