తెలుగు న్యూస్ / తెలంగాణ /
Srisailam Tour Package : ఇయర్ ఎండ్ లో 'శ్రీశైలం' దర్శనం - రోప్ వే జర్నీ కూడా చేయవచ్చు..! ఈ టూర్ ప్యాకేజీ చూడండి
Telangana Tourism Srisailam Package : ఈ ఇయర్ ఎండ్ వేళ శ్రీశైలం చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. రెండు రోజులపాటు ట్రిప్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. టూర్ షెడ్యూల్, ధరల వివరాలను ఇక్కడ చూడండి….
శ్రీశైలం టూర్ ప్యాకేజీ
ఇయర్ ఎండ్ వచ్చేసింది..! ఈ చివరి వీకెండ్ లో ఏదైనా అధ్యాత్మిక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ట్రిప్… రెండు రోజులపాటు ఉంటుంది. బస్సులో జర్నీ ఉంటుందని తెలంగాణ టూరిజం పేర్కొంది.
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… శ్రీశైలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చూపిస్తారు. ప్రస్తుతం ఈ ట్రిప్ డిసెంబర్ 29, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు.
శ్రీశైలం టూర్ ప్యాకేజీ వివరాలు :
- హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపేరట్ చేస్తుంది.
- DAILY SRISAILAM TOUR పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
- ఏసీ, నాన్ ఏసీ బస్సు సౌకర్యం ఉంటుంది. ఎంచుకున్న దానిబట్టి టికెట్ ధరలు ఉంటాయి.
- చూసే ప్రాంతాలు : శ్రీశైలం దర్శనం, పాతాళగంగా, పాలధార(Paaladhara), పంచధార, శ్రీశైలం డ్యామ్ ప్రాంతాలను చూడొచ్చు.
- ఫస్ట్ డే - 1 హైదరాబాద్లోలోని పర్యాటక భవన్ నుంచి 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది. భోజనం తర్వాత మార్గమధ్యంలో సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు.
- సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్కు వెళతారు. శ్రీశైలంలోనే రాత్రి బస ఉంటుంది. (శ్రీశైలం హోటల్లో దుప్పట్లు అందించబడవు. పర్యాటకులు సొంతంగా దుప్పట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.)
- డే 2 - రెండో రోజు ఉదయం టిఫిన్ చేస్తారు. హోటల్ నుండి చెక్ అవుట్ తర్వాత రోప్ వేకు వెళ్తారు. ఈ జర్నీ అద్భుతంగా ఉంటుంది. పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్ తదితర ప్రాంతాలను చూస్తారు.
- రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
- టికెట్ ధరలు : ఏసీ బస్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ.2400, పిల్లలు (5 నుంచి 12సంవత్సరాలు) రూ.2392చెల్లించాల్సి ఉంటుంది.
- నాన్ AC బస్ ప్యాకేజీలో పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు.
- అధికారిక వెబ్ సైట్ - https://tourism.telangana.gov.in/
- శ్రీశైలం టూర్ ప్యాకేజీ లింక్ - https://tourism.telangana.gov.in/package/srisailamtour
సంబంధిత కథనం