హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ నిపుణుల బృందం అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఏడేళ్ల విదేశీ చిన్నారి జీవితాన్ని రక్షించింది. గతంలో అనేక ఆసుపత్రులలో చికిత్స కోసం ప్రయత్నించినా.. ట్యూమర్ స్థానం సంక్లిష్టంగా ఉండటంతో శస్త్రచికిత్స సాధ్యపడదని వైద్యులు నిరాకరించారు.
బాధిత చిన్నారి మెదడు స్టెమ్ ప్రాంతంలో అరుదైన, ప్రమాదకరమైన ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెదడు స్టెమ్ అనేది అత్యంత సున్నితమైన ప్రాంతం. చిన్న పొరపాటు చేసినా.. తీవ్ర న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు వివరించారు. ఈ క్లిష్టమైన కేసును సీనియర్ న్యూరో కన్సల్టెంట్ డా.శ్రీకాంత్ రెడ్డి స్వీకరించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ట్యూమర్ను పూర్తిగా తొలగించారు.
శస్త్రచికిత్స తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పిల్లల ఐసీయూ కీలక భూమిక పోషించింది. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడేందుకు మైక్రో లెవెల్ మానిటరింగ్, వెంటిలేటరీ మద్దతు, న్యూరో ప్రొటెక్షన్ పద్ధతులతో చికిత్సను కొనసాగించారు. 'బ్రెయిన్ సర్జరీ తరువాత పిల్లలకు చికిత్స చాలా సున్నితమైనది. ప్రతి నిమిషం ప్రతి పరిణామాన్ని సమీక్షిస్తూ.. మేము చికిత్సను అందించాం' అని పీడియాట్రిక్ ఐసీయూ హెచ్ఓడీ డా. జనార్దన్ రెడ్డి చెప్పారు. 'వివిధ విభాగాల సమన్వయం, ప్రత్యేకమైన పీడియాట్రిక్ ఐసీయూ వాతావరణం త్వరగా కోలుకోవడంలో కీలకంగా మారింది' అని ఆయన వివరించారు.
ఈ చికిత్స గురించి పిల్లల విభాగం హెచ్ఓడీ డా.రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. 'పిల్లల వైద్యంలో మేము కేవలం శస్త్రచికిత్స మాత్రమే కాకుండా.. వారి మనోభావాలకు భరోసా కలిగించే విధంగా శ్రద్ధ గల చికిత్సా వాతావరణం కల్పిస్తాం. ఈ చిన్నారి కేసు మా టీమ్ సమిష్టి నైపుణ్యానికి ఉదాహరణ' అని వ్యాఖ్యానించారు.
శస్త్రచికిత్స అనంతరం ట్యూమర్ను లో గ్రేడ్గా నిర్ధారించారు. ప్రస్తుతం చిన్నారి రేడియేషన్ చికిత్స పొందుతూ.. కోలుకుంటున్నారు. ఈ విజయం మెడికవర్ హాస్పిటల్స్ను అత్యాధునిక న్యూరోసర్జరీ, పిల్లల వైద్యంలో నిపుణులుగా నిలిపింది. అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య బృందం సమన్వయంతో పునర్జీవితం పొందిన ఈ చిన్నారి కథ.. నమ్మకానికి మారుపేరుగా నిలుస్తోంది.
సంబంధిత కథనం