వేసవిలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ సమయంలో చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఈ ట్రైన్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం మార్గంలో రాకపోకలు సాగిస్తాయని.. అధికారులు వెల్లడించారు.
చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్ (07421) రైలు మే 13 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం ఏడు సర్వీసులు ఉంటాయని అధికారులు వివరించారు. చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్ (07425) మే 12 నుంచి జూన్ 23 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం ఆరు సర్వీసులు ఉంటాయి.
శ్రీకాకుళం రోడ్- చర్లపల్లి (07422) రైలు మే 14 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం ఏడు సర్వీసులు ఉంటాయి. శ్రీకాకుళం రోడ్- చర్లపల్లి (07426) రైలు మే 12 నుంచి జూన్ 23 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది. మొత్తం ఆరు సర్వీసులు ఉంటాయని అధికారులు వివరించారు. ప్రయాణికులు ఈ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇవే కాకుండా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. విశాఖ- బెంగళూరు, విశాఖపట్నం- తిరుపతి, విశాఖపట్నం- కర్నూలు సిటీ మధ్య మొత్తం 42 వేసవి వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనుంది. మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. విశాఖపట్నం- బెంగళూరు (ట్రైన్ నం.08581/08582) ఆదివారం, తిరుగు ప్రయాణంలో సోమవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, జోలార్పేట్, కుప్పం, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది.
విశాఖపట్నం నుంచి తిరుపతికి (08547) ప్రతి బుధవారం, తిరుగు ప్రయాణంలో (08548) గురువారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలోఆగుతుంది.
ప్రతి మంగళవారం విశాఖ నుంచి కర్నూలు సిటీకి (08545), తిరుగు ప్రయాణంలో బుధవారాల్లో (08546) రైలు అందుబాటులో ఉంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్లలో ఆగుతుంది.
సంబంధిత కథనం