వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. రైల్వే ప్రయాణాల సంఖ్య పెరగటంతో స్టేషన్లలో రద్దీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్ రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను నడపనుంది.
విశాఖ – బెంగళూరు (08581) మధ్య జూన్ ఒకటి నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుంది . మరోవైపు బెంగళూరు - విశాఖ మధ్య జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు అందుబాటులో ఉంటుంది.
విశాఖ -తిరుపతి రైలు జూన్ 5 నుంచి జులై 31 వరకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. ఇక ప్రతి బుధవారం విశాఖ – తిరుపతి (08547) మధ్య మరో స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్ జూన్ 4 నుంచి జులై 30 వరకు రాకపోక సాగించనుంది.
మరోవైపు ప్రతి శుక్రవారం విశాఖ -చర్లపల్లి (08579) రైలు జూన్ 6 నుంచి జులై 27 వరకు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఇక ప్రతి శనివారం చర్లపల్లి నుంచి – విశాఖపట్నం (08580) మధ్య జూన్ 7 నుంచి జులై 26 వరకు స్పెషల్ ట్రైన్ నడవనుంది.