SCR Mahakumbh Mela Special Trains 2025 : ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా... ఏపీ, తెలంగాణ నుంచి 26 ప్రత్యేక రైళ్లు, వివరాలివే-south central railway to run 26 additional maha kumbh mela 2025 special trains ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Mahakumbh Mela Special Trains 2025 : ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా... ఏపీ, తెలంగాణ నుంచి 26 ప్రత్యేక రైళ్లు, వివరాలివే

SCR Mahakumbh Mela Special Trains 2025 : ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా... ఏపీ, తెలంగాణ నుంచి 26 ప్రత్యేక రైళ్లు, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 03, 2025 02:45 PM IST

SCR Maha Kumbh Mela Trains 2025: ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ నుంచి మరో 26 స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ రైళ్లు… పలు స్టేషన్లలో ఆగుతాయి.

మహా కుంభమేళకు 26 ప్రత్యేక రైళ్లు
మహా కుంభమేళకు 26 ప్రత్యేక రైళ్లు

మహా కుంభమేళకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు… ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగనున్నాయి.

yearly horoscope entry point

రూట్ల వివరాలు:

  • గుంటూరు - అజంఘర్ (ఫిబ్రవరి 14, 2025 నుంచి)
  • అజంఘర్ - విజయవాడ -(ఫిబ్రవరి 16, 2024 నుంచి)
  • అజంఘర్ - మచిలీపట్నం(ఫిబ్రవరి 5 నుంచి)
  • కాకినాడ - అజంఘర్
  • అజంఘర్ - విజయవాడ
  • మౌలాలి - బనారస్
  • బనారస్ - మౌలాలి
  • మౌలాలి - గయా
  • వికారాబాద్ - గయా
  • విజయవాడ - గయా
  • గయా - వికారాబాద్
  • కాకినాడ - గయా
  • గయా - విజయవాడ
  • నాందేడ్ - పట్నా
  • పట్నా - నాందేడ్
  • ఔరంగబాద్ - పాట్నా
  • పాట్నా - కాచిగూడ
  • సికింద్రాబాద్ - పాట్నా
  • పాట్నా - సికింద్రాబాద్ (ఫిబ్రవరి 9, 2025).

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, కాకినాడ టౌన్‌ తో పాటు… తెలంగాణలోని మౌలాలి జంక్షన్‌, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల మీదుగా ఈ ట్రైన్స్ నడవనున్నాయి. ఈ జంక్షన్ల మధ్యలో ఉండే స్టేషన్లలో కూడా ఈ ట్రైన్స్ ఆగుతాయి.

మరో 12 ప్రత్యేక రైళ్లు - వివరాలు:

మహా కుంభమేళకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఇటీవలే 12 ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 12 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది.

  • తిరుపతి - బనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ రైళ్లు జనవరి 18, ఫిబ్రవరి 2, 25, 15, 22 తేదీల్లో ఈ ట్రైన్స్ రాకపోకలు ఉంటాయి. ఈ రైళ్లు నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామల్ కోట, అన్నవరం, ఎలమంచలి, అనకాపల్లి, రాయగడ, మునిగుడతో పాటు మరికొన్ని స్టేషన్లలో ఆగుతాయి.
  • బనారస్ - విజయవాడ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. జనవరి 20, ఫిబ్రవరి 2, 25, 17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి.. బుధవారం ఉదయం 5.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
  • ఇక నర్సాపూర్ నుంచి బనారస్ కు 2 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. జనవరి 26, ఫిబ్రవరి 2 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ ఉదయం 6 గంటలకు బయల్దేరి... మధ్యాహ్నం 3.45 గంటలకు బనాసర్ చేరుతుంది.
  • బనారస్ నుంచి నర్సాపూర్ మధ్య మరో 2 ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ ట్రైన్ జనవరి 27, ఫిబ్రవరి 3వ తేదీన ఉంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై... ఉదయం 5 గంటలకు నర్సాపూర్ చేరుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం