Telugu News  /  Telangana  /  South Central Railway Announced 8 Mmts Special Trains For Ganesh Immersion
ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు
ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు

MMTS Special Trains : గణేష్ నిమజ్జనం కోసం ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు

08 September 2022, 15:33 ISTHT Telugu Desk
08 September 2022, 15:33 IST

South Central Railway : గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ఎనిమిది MMTS ప్రత్యేక రైళ్లను నడపనుంది.

MMTS Special Trains : భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనానికి అంతా ఏర్పాట్లు అయ్యాయి. భక్తుల రద్దీ విపరీతంగా ఉండనుంది. ఈ కారణంగా ఎనిమిది ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం సాయంత్రం 4 గంటల వరకు నడుస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

శుక్రవారం మరియు శనివారం మధ్య రాత్రులలో నడిచే ఎనిమిది MMTS ప్రత్యేక రైళ్ల షెడ్యూల్:

సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే జీఎస్‌హెచ్-1 రైలు శుక్రవారం రాత్రి 11.30 గంటలకు బయలుదేరి 12.05 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

హైదరాబాద్ నుండి లింగంపల్లికి వెళ్లే రైలు నెం-జీహెచ్‌ఎల్-2 శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 1.20 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

రైలు నెం-GLH-3 లింగంపల్లి నుండి హైదరాబాద్‌కు శనివారం తెల్లవారుజామున 1.50 గంటలకు బయలుదేరి 2.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

రైలు నెం-జీహెచ్‌ఎస్-4 హైదరాబాద్-సికింద్రాబాద్ శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

రైలు నెం-జీహెచ్‌ఎల్-5 హైదరాబాద్-లింగంపల్లి శుక్రవారం రాత్రి 11 గంటలకు బయలుదేరి రాత్రి 11.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

రైలు నెం-GLF-6 లింగంపల్లి-ఫలక్‌నుమా శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు బయలుదేరి 1.50 గంటలకు ఫలక్‌నుమా చేరుకుంటుంది.

రైలు నెం-జీఎఫ్‌ఎస్-7 ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌లో శనివారం తెల్లవారుజామున 2.20 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

రైలు నెం-GSH-8 సికింద్రాబాద్-హైదరాబాద్ శనివారం ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి తెల్లవారుజామున 4.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా యశ్వంతపూర్, నర్సాపూర్ కు స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

narasapur yesvantpur trains: నర్సాపూర్ - యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. సెప్టెంబర్ 9, 11వ తేదీల్లో నర్సాపూర్ నుంచి 03.20 గంటలకు బయల్దేరుతుంది. ఆయా తేదీల మరునాడు ఉదయం 10.50 గంటలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది.

yesvantpur narasapur special trains: ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 10, 12 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరుతుంది. ఆయా తేదీల మరునాడు ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.