Siddipet CP On Fake Calls Alert : తెలంగాణ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) పేరుతో వచ్చే ఫేక్ కాల్స్, మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సీపీ అనురాధ తెలిపారు. ఫోన్స్ సిమ్ కార్డు బ్లాక్ అవుతున్నాయంటూ కాల్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఫేక్ కాల్స్ ను నమ్మవద్దని సీపీ సూచించారు. గుర్తుతెలియని నెంబర్ ద్వారా ఫోన్ వస్తే రెస్పాండ్ కావొద్దన్నారు. ఓటీపీ నెంబర్,బ్యాంకు వివరాలు,ఆధార్ కార్డు వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చెప్పవద్దని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.
1. లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
2. కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
3. అపరిచిత నెంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
4. లాటరీ ఆఫర్స్ అంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
5. అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు. వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
6. OLX, 99acres, Magicbricks లాంటి యాప్స్ లలో ఆర్మీ సైనికులు, ఆఫీసర్లు అంటూ ఎవరైనా సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.
7. ఈజీ రిటర్న్స్, కమీషన్ ఆధారిత సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
8. పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
9. మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
10. సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలి. లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో రిపోర్ట్ చేయాలి.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని డబ్బులు పొగొట్టుకుంటే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని సిద్ధిపేట సీపీ సూచించారు. సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712665862 సమాచారం అందించాలని తెలిపారు.
సంబంధిత కథనం