సికింద్రాబాద్ లో ఘోర ప్రమాదం, లిఫ్ట్ కూలి ముగ్గురు మృతి-secunderabad construction lift collapse 3 workers dead in tragic accident ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సికింద్రాబాద్ లో ఘోర ప్రమాదం, లిఫ్ట్ కూలి ముగ్గురు మృతి

సికింద్రాబాద్ లో ఘోర ప్రమాదం, లిఫ్ట్ కూలి ముగ్గురు మృతి

సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. డంపింగ్ యార్డులో పవర్ ప్రాజెక్ట్ లిఫ్ట్ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వీరంతా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు.

సికింద్రాబాద్ లో ఘోర ప్రమాదం, లిఫ్ట్ కూలి ముగ్గురు మృతి

సికింద్రాబాద్‌ పరిధిలోని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. డంపింగ్‌ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్‌ తెగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్‌ ప్రాజెక్ట్ లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్‌ కూలిపోయిందని అక్కడున్నవారు చెబుతున్నారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సురేశ్‌ సర్కార్‌ (21), ప్రకాశ్‌ మండల్‌ (24), అమిత్రాయ్‌ (20)గా పోలీసులు గుర్తించారు.

పలువురికి గాయాలు

ఈ ఘటన జరిగిన వెంటనే ముగ్గురిని హుటాహుటిన ఈసీఐఎల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందారని పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

లిఫ్ట్ మీద పడి ఆర్ఎంపీ వైద్యుడు మృతి

హైదరాబాద్ నగరంలోని ఇటీవల లిఫ్ట్‌ ప్రమాదం జరిగింది. సూరారంలోని ఓ అపార్ట్మెంట్ లో లిఫ్ట్‌ మీద పడి ఆర్ఎంపీ వైద్యుడు అక్బర్‌ పాటిల్‌ (39)మృతి చెందారు. అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ గుంతలోకి బంతిని తీసేందుకు తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్‌ పడటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

లిఫ్ట్ ప్రమాదాలు

ఇటీవల హైదరాబాద్ వరుస లిఫ్ట్‌ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల నాంపల్లిలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఓ చిన్నారి మృతి చెందాడు. మరో ఘటనలో మెహదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌ పీఎస్ పరిధిలోని సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించాడు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం