SCR Special Trains: అలర్ట్.. తిరుపతితో పాటు ఈ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ - టైమింగ్స్ ఇవే
South Central Railway Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తిరుపతితో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వాటి వివరాలు చూస్తే….
South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా పలు రూట్లలో కొత్త సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా కాచిగూడ - తిరుపతి, తిరుపతి - కాచిగూడ, కాచిగూడ - కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ - కాచిగూడ మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనుంది.
ట్రెండింగ్ వార్తలు
కాచిగూడ-తిరుపతి(ట్రైన్ నెం -07061) స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. మే 25వ తేదీన ఈ స్పెషల్ ట్రైన్ రాత్రి 10.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఇక తిరుపతి-కాచిగూడ( ట్రైన్ నెం- 07062 ) ట్రైన్ ను ఈ నెల 26వ తేదీన నడపనున్నట్లు దక్షణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాచిగూడకు చేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
ఇక కాచిగూడ-కాకినాడ టౌన్(ట్రైన్ - 07417 ) మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. ఈ ప్రత్యేక రైలు మే 27వ తేదీన రాత్రి 8:45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 08:45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఇక కాకినాడ టౌన్(ట్రైన్ నెంబర్ 07418) నుంచి కూడా ఈ నెల 28న ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ ట్రైన్ కాకినాడ నుంచి 09.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్స్... కాచిగూడ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సమార్లకోట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు ప్రకటించారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ - 2 టైర్, ఏసీ - 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.