Tirupati Special Trains : తిరుపతికి ప్రత్యేక రైళ్లు.. వయా జడ్చర్ల, గద్వాల్..-scr announced special trains between secunderabad tirupati ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Scr Announced Special Trains Between Secunderabad - Tirupati

Tirupati Special Trains : తిరుపతికి ప్రత్యేక రైళ్లు.. వయా జడ్చర్ల, గద్వాల్..

HT Telugu Desk HT Telugu
Mar 30, 2023 02:25 PM IST

South Central Railway Special Trains: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు టైమింగ్స్ వివరాలను పేర్కొంది.

సికింద్రాబాద్ - తిరుపతి ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ - తిరుపతి ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్ని సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Secunderabad - Tirupati Special Trains: వేసవి రద్దీని తగ్గించేందుకు తిరుపతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి (ట్రైన్ నెంబర్ 07489) ప్రత్యేక రైలు ఏప్రిల్ 7 , 14 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి రాత్రి08.10 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 09 గంటలకు తిరుపతి చేరుతుంది.

ఇక తిరుపతి-సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ 07490) మధ్య స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ రైలు… ఏప్రిల్ 9 , 16 తేదీలలో నడుస్తుంది. ఇది తిరుపతి నుంచి సాయంత్రం 04.35 గంటలకు బయల్దేరి మరునాడు ఉదయం 06.25 గంటలకు సికింద్రాబాద్ చేరుతుందని అధికారులు ప్రకటించారు.

ఈ స్పెషల్ ట్రైన్స్….. కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, తాడిపత్రి, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఏసీ II టైర్, ఏసీ III టైర్, స్లీపర్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.

మరోవైపు మచిలీపట్నం - కర్నూలు సిటీ మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. మచిలీపట్నం - కర్నూల్ సిటీ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. మచిలీపట్నం - కర్నూల్ సిటీ (ట్రైన్ నెంబర్ 07067) మధ్య ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ప్రత్యేక రైలును నడపనున్నారు. శని, మంగళ, గురువారం రోజుల్లో నడుస్తాయి. ఇక కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నం(ట్రైన్ నెంబర్ 07068) మధ్య ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు స్పెషల్ ట్రైన్ నడుపుతారు. ఈ ప్రత్యేక రైలు... ఆదివారం, బుధవారం, శుక్రవారం రోజుల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు ప్రకటించారు.

ఆగే స్టేషన్లు ఇవే...

ఈ ప్రత్యేక రైళ్లు.... గుడివాడ, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, దోనకొండ, మర్కాపూర్, గిద్దలూరు, డోన్ రైల్వేస్ఠేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లలో ఏసీీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని పేర్కొంది. ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరింది.

IPL_Entry_Point