రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు-త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించున్న సీఎం, మంత్రులు-saraswati pushkaralu triveni sangamam starts on may 15th cm revanth reddy ministers attends ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు-త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించున్న సీఎం, మంత్రులు

రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు-త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించున్న సీఎం, మంత్రులు

రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ ను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వర త్రివేణీ సంగమంలో సీఎం, మంత్రులు పుణ్యస్నానం ఆచరిస్తారు.

రేపటి నుంచి సరస్వతి పుష్కరాలు-త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించున్న సీఎం, మంత్రులు

జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15న ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పుష్కర ఘాట్ ప్రారంభం అనంతరం, కాళేశ్వర త్రివేణీ సంగమంలో ముఖ్యమంత్రి పుణ్యస్నానం ఆచరిస్తారు.

12 సంవత్సరాలకు ఒకసారి

ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు కూడా ఈ పుష్కరాలలో పాల్గొంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అరుదైన సరస్వతి మహా పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు(15 న) ఉదయం 5 .44 గంటలకు తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పాటు పుష్కర స్నానం ఆరంభిస్తారు.

తాత్కాలిక టెంట్ సిటీ

ప్రతీ రోజూ ఉదయం 8 .30 గంటల నుండి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సరస్వతి ఘాట్ లో 6 .45 నుండి 7 .35 గంటల వరకు సరస్వతి ఘాట్ లో ప్రత్యేక సరస్వతి నవరత్న మాలహారతి నిర్వహిస్తారు. పుష్కర్ స్నానం ఆచరించే వారికి తాత్కాలిక టెంట్ సిటీ లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రోజూ రాత్రి కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలో

సరస్వతి నదిని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే "అంతర్వాహిని" (అదృశ్య నది) గా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథునరాశి (మిథునరాశి)లోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు.

ఏడాదికి ఒకసారి

బృహస్పతి దేవగురువు... బృహస్పతి జ్ఞానం, విద్య , ఆధ్యాత్మికతకు అధిపతిగా పరిగణించబడుతున్నాడు. బృహస్పతిని గురుగ్రహం అని కూడా అంటారు. గురువు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఒక రాశి నుంచి వెళ్లిన తర్వాత అదే రాశిలోకి అడుగు పెట్టడానికి 12 ఏళ్లు పడతాయి. ఏ రాశి లో సంచరిస్తాడో ఆ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 14 న రాత్రి 10.35 గం మిథునరాశిలోకి బృహస్పతి అడుగు పెట్టనున్నాడు.

అంతర్వాహిని

సరస్వతి నది అంతర్వాహినిగా కాళేశ్వరం దగ్గర ప్రవహిస్తుంది. 2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతుందని.. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు వివరించారు. మే 15 నుంచి 26 వరకు పుష్కర కాలం ఉంటుందని వివరించారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.