ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది.
హైదరాబాద్ లోని జేబీఎస్,ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్ పల్లి, జీడిమెట్ల, మేడ్చల్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది. 40 మంది కలిసి పుష్కరాలకు వెళ్లాలని అనుకుంటే వారి కాలనీలకే ప్రత్యేక బస్సులను పంపేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది.
ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం https://www.tgsrtcbus.in/ వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించింది.
ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్రమైన సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేసే విధంగా టీజీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం మే 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను సరస్వతి పుష్కరాలకు నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులు ప్రధాన పుష్కర ఘాట్లకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల (జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్) నుంచి మెట్రో డీలక్స్ బస్సులు నడుపనున్నారు.
వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా, ఒకే కాలనీలో 40 మంది ప్రయాణికులు ఉంటే ఆ కాలనీకే బస్సు పంపిస్తారు. అలాంటి ప్రత్యేక బస్సుల కోసం 9676671533, 9959226154, 9959226160 నెంబర్లను ప్రయాణికులు సంప్రదించవచ్చు.
సంబంధిత కథనం