తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఉరి వేసి చంపి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దన్నారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ప్రమీల భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే గత కొంత కాలంగా ప్రమీల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం భర్త ప్రవీణ్ కు తెలియడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
శుక్రవారం కూడా ప్రవీణ్, ప్రమీల మధ్య జరిగింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత తన ప్రియుడితో కలిసి ప్రవీణ్కు ఉరి వేసి హత్య చేసింది. ఆ తర్వాత ప్రవీణ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కోడలి తీరుపై అనుమానం వచ్చిన ప్రవీణ్ తల్లిదండ్రులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను విచారించి ప్రమీలతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొన్నారు. వీరిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. వీరిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కందుకూరు పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ తన వివాహేతర సంబంధాన్ని రహస్యంగా ఉంచడానికి తన ప్రేమికుడి సహాయంతో భర్తను హత్య చేసిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎరుకలి యాదయ్య, అతని భార్య మౌనిక దినసరి కూలీలుగా పనిచేసేవారు.
యాదయ్య మద్యానికి బానిసై ఇంట్లో తరచుగా గొడవ చేస్తుండేవాడు. అయితే మౌనిక తాను పనిచేసే పత్తి మిల్లులో కూరగాయల సరఫరాదారు అయిన అశోక్తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం బయటపడుతుందనే భయంతో వారిద్దరూ యాదయ్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.
ఫిబ్రవరి 18న బంధువుల ఇంట్లో విందుకు వెళ్లాలనే నెపంతో మౌనిక తన భర్తను కొత్తూరు మండలం గూడూరు గ్రామ శివార్లకు తీసుకెళ్లింది. అక్కడ అశోక్, మౌలిక, యాదయ్య మద్యం తాగారు. యాదయ్య తాగిన మత్తులో ఉండటంతో మౌనిక, అశోక్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని యాదయ్య గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత అతడి శరీరంపై పెట్రోల్ పోసి, నిప్పంటించారు.
ఆ తర్వాత మౌనిక తన భర్త కనిపించడం లేదని నటిస్తూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల దర్యాప్తులో ఆమె వాంగ్మూలంపై అనుమానం వచ్చింది. దీంతో వారి తరహాలో దర్యాప్తు చేయగా మౌనిక, అశోక్ నేరం అంగీకరించారు. ఇద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.
సంబంధిత కథనం