ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు..!-rains likely for another four days in telangana imd weather updates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు..!

ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు..!

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

వర్షాలు

ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం నుంచి దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా, ఏపీ, మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం….ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఎల్లుండి(అక్టోబర్ 12, 2025) ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. పలుచోట్ల 30 - 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి.

మరోవైపు ఏపీలో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం