Rahul Cooking Video: బొంగులో చికెన్ వండిన రాహుల్.. టీ కాంగ్రెస్ నేతలతో ముచ్చట్లు-rahul gandhi himself cooked bombo chicken fun with telangana congress leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rahul Gandhi Himself Cooked Bombo Chicken Fun With Telangana Congress Leaders

Rahul Cooking Video: బొంగులో చికెన్ వండిన రాహుల్.. టీ కాంగ్రెస్ నేతలతో ముచ్చట్లు

HT Telugu Desk HT Telugu
Nov 13, 2022 10:19 AM IST

Rahul Gandhi Cooking Bamboo Chicken: తెలంగాణలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసింది టీ కాంగ్రెస్. ఆ సమయంలో తమ పార్టీ అగ్రనేతతో గడపిన మధుర క్షణాలను వీడియోరూపంలో పంచుకున్నారు.

చికెన్ వండిన రాహుల్ గాంధీ - వీడియో విడుదల చేసిన టీ కాంగ్రెస్
చికెన్ వండిన రాహుల్ గాంధీ - వీడియో విడుదల చేసిన టీ కాంగ్రెస్

Rahul Gandhi Cooking Bamboo Chicken Video: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో సక్సెస్ ఫుల్గా ముగిసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఫిదా అయ్యారు అగ్రనేత రాహుల్. అయితే ఈ సమయంలో అగ్రనేతతో పార్టీ నేతలు గడిపిన మధుర క్షణాలను వీడియోరూపంలో పంచుకున్నారు. ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

మక్తాల్ నుంచి తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది రాహుల్ జోడో యాత్ర. తొలిరోజు 25 కిలోమీటర్లు నడిచారు. అయితే పాదయాత్ర సమయంలోని అనుభూతులను రాహుల్ తో పంచుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తొలిరోజు తాను నడవకపోయానని, ఆ తర్వాత నెమ్మదిగా అలవాటు చేసుకొని... ఇబ్బందిలేకుండా ముందుకు సాగనని కల్వకర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలో యాత్రను బాగా నిర్వహించారని జగ్గారెడ్డికి రాహుల్‌ గాంధీ కితాబిచ్చారు. 25 కిలో మీటర్ల పాదయాత్రలో ఎన్నో వర్గాలను కలిశారని, మేధావులతో చర్చించారని.. అవి ఎంతో ప్రభావం చూపినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనగా.. మరి కొన్ని కిలోమీటర్లు దూరం పెంచమంటారా అంటూ రాహుల్‌ చమత్కరించారు.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పాదయాత్రలో చాలా మంది కేరళ నాయకులు తనతో నడవలేక పడిపోయారని, కొందరు కింద పడిపోయారని చెప్పారు. కర్ణాటక, తమిళనాడులో కూడా అలాగే జరిగిందని... కానీ తెలంగాణ నేతల్లో ఎవరికి అలా కాలేదని చెప్పుకొచ్చారు. తాను ఆర్​ఎస్​ఎస్​ నుంచి వచ్చానని, అక్కడ గాంధీ కుటుంబంపై విద్వేషాన్ని నూరి పోసేవారని రాహుల్ తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నార. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబంపై ఎందుకీ విమర్శలని తనలో పరివర్తన వచ్చిందని చెప్పారు. ఈ వీడియోలో భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, సంపత్ కుమార్ వారి అనుభవాలను రాహుల్ తో పంచుకున్నారు.

ఇక భద్రాచలంలోని గిరిజనులతో కలిసి రాహుల్‌గాంధీ.. స్వయంగా బొంగులో చికెన్‌ వండారు. బొంగులో చికెక్‌ను స్వయంగా గిరిజనులు, పార్టీ నేతలకు రాహుల్‌గాంధీ వడ్డించారు. స్వయంగా తన చేతులతో చికెన్కు మసాలా దట్టించి బొంగుల్లో పెట్టి వాటిని మంటపై కాల్చారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

IPL_Entry_Point